PRINT TIME: April 10, 2026 06:14 AM
రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ
రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ
March 09, 2026 04:02 PM
57 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కూసుమంచి: రైతులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కూరగాయ విత్తనాలను అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులకు 100 శాతం రాయితీతో ఐదు రకాల కూరగాయల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ విత్తనాల్లో టమాటా, వంగ, బెండ, పాలకూర, తోటకూర రకాలు ఉన్నాయని తెలిపారు. ఒక్కో రైతుకు ఒక యూనిట్గా సుమారు 60 గ్రాముల విత్తనాలు అందజేస్తారని, ఇవి సుమారు 0–20 విస్తీర్ణంలో సాగు చేసుకునేందుకు సరిపోతాయని వివరించారు.
విత్తనాలు అవసరమైన రైతులు ఉద్యాన శాఖను సంప్రదించాలని పాలేరు ఉద్యాన అధికారి పి. అపర్ణ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 89777 14104 నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి