Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఊరూరా ఘనంగా సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు: డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం.. ఉప్పెనలా చెలరేగిన కోహ్లీ, పడిక్కల్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 09:34 PM

రుణమాఫీ ఏది? రైతుల ఆవేదన..

రుణమాఫీ ఏది? రైతుల ఆవేదన..

రుణమాఫీ ఏది? రైతుల ఆవేదన..
March 29, 2026 07:46 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

పానగల్ రైతు వేదిక వద్ద బాధితుల నిరసన

బ్యాంకు పేరు మార్పుతో తలెత్తిన 'ఐఎఫ్ఎస్సీ' చిక్కులు..

రోడ్డుపై బైఠాయించి ఆందోళన, అధికారుల నిర్లక్ష్యంపై ధ్వజం..


నల్లగొండ : ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమ దరికి చేరడం లేదంటూ నల్లగొండ జిల్లాలోని పానగల్ - ఖాజీ రామారం రైతు వేదిక వద్ద రైతులు ఆదివారం భారీ నిరసన చేపట్టారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం కారణంగా సుమారు 300 మంది రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో తమకు రుణమాఫీ వర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.ముఖ్యంగా ఏపీజీవీబీ (APGVB) బ్యాంకు ఇటీవల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGGVB) గా రూపాంతరం చెందడంతో ఐఎఫ్ఎస్సీ (IFSC) కోడ్‌ల మార్పు జరిగిందని దీనివల్ల డేటా మిస్ మ్యాచ్ అయ్యి తమకు రుణమాఫీ నిధులు జమ కాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. జనవరి 1, 2025న బ్యాంకుల విలీనం జరిగినప్పటికీ, జనవరి 18న ప్రభుత్వం విడుదల చేసిన నాలుగో విడత రుణమాఫీలో తమ పేర్లు లేకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. రేషన్ కార్డు లేని రైతులకు సైతం రుణమాఫీ క్లియర్ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా, ఏపీజీవీబీ ఖాతాదారులైన తమకు మాత్రం అన్యాయం జరిగిందని బాధితులు వాపోతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ధ్వజం..

బ్యాంకు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని, ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు గ్రామాల నుంచి తరలివచ్చిన దాదాపు 300 మంది రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, సాంకేతిక సమస్యలను పరిష్కరించి తమ ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. 


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News