Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండుతున్న ఎండల్లో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన పల్లపు బుద్ధుడు రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 04:19 PM

రామన్నపేటలో సమస్యల పరిష్కారానికి వినతి.

రామన్నపేటలో సమస్యల పరిష్కారానికి వినతి.

రామన్నపేటలో సమస్యల పరిష్కారానికి వినతి.
April 27, 2026 02:28 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నాయకులు గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ అనురాధకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్ మాట్లాడుతూ… 619 సర్వే నంబర్ల పరిధిలోని లోతుకుంట భూమి అక్రమ కబ్జాకు గురవుతోందని ఆరోపించారు. సిమెంట్ ఇటుక తయారీ పేరుతో ఆక్రమణలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భూమిని సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే 7వ వార్డులో అసంపూర్తిగా ఉన్న మోరీలను పూర్తి చేయాలని, 14వ వార్డులో కోర్టు కాలనీ నుంచి పెద్ద మోరీ వరకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని కోరారు. అమ్మనబోలు రూట్‌లో మోకాళ్ల సోమయ్య ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న మోరీని సరిచేయాలని, సకరికుంట నుంచి ఆసుపత్రి వరకు వరద కాలువ నిర్మించాలని తెలిపారు.

12వ వార్డులో పద్మశాలి కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని, మాజీ సర్పంచి మొగులయ్య ఇంటి వద్ద అసంపూర్తిగా ఉన్న మోరీని పునరుద్ధరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పల్లె సత్యం, వెంకట్ రెడ్డి, బావడ్లపెళ్లి సత్యం, గంజి అశోక్, బొల్ల వెంకటేశ్వర్లు, రాసాల రమేశ్, నకిరేకంటి సురేశ్, మునుకుంట్ల రాణి, కుందూరు వెంకటేశ్వర్లు, గొరిగే మల్లేశం, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News