రామన్నపేటలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: సీపీఎం
రామన్నపేటలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: సీపీఎం
స్థానికం బృందం
:రామన్నపేట పట్టణంలో పాత నేతాజీ క్లబ్ను పునరుద్ధరించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 16న సీపీఎం ఆధ్వర్యంలో రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచాలని చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
స్థానిక క్రిస్టియన్ కాలనీలో నిర్వహించిన ఇంటింటి సీపీఎం కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ మాట్లాడుతూ రామన్నపేట ఆసుపత్రి నిర్మించి 52 సంవత్సరాలు కావడంతో శిథిలావస్థకు చేరిందని తెలిపారు. ఆసుపత్రిలో 22 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట ప్రస్తుతం కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాత నేతాజీ క్లబ్ అన్యాక్రాంతం అవుతున్న నేపథ్యంలో దానిని పునరుద్ధరించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే పట్టణ యువతతో పాటు సీనియర్ సిటిజన్లకు వ్యాయామం చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అలాగే అక్కడ ముందుగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని పాలకులు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు గొరిగే సోములు, బావండ్లపల్లి బాలరాజు, బోళ్ళ వెంకన్న, పల్లె సత్యం, కడారి రాములు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి