Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పసునూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 05, 2026 08:23 PM

రామన్నపేటలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

రామన్నపేటలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

రామన్నపేటలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
April 05, 2026 02:46 PM 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలో భారత మాజీ కేంద్ర మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి బంగ్లాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత అని కొనియాడారు.

1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని చంద్వా గ్రామంలో జన్మించిన ఆయన, సాధారణ రైతు కుటుంబం నుంచి ఎదిగి జాతీయ నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా దాదాపు 50 సంవత్సరాలు సేవలందించి విశేష కీర్తి గడించారని గుర్తుచేశారు. 1971 భారత్–పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించినట్టు తెలిపారు.

అలాగే 1928లో జరిగిన కార్మిక ర్యాలీలో సుభాష్ చంద్రబోస్ దృష్టిని ఆకర్షించిన ఆయన, దళిత హక్కులు మరియు సామాజిక సమానత్వం కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా నిలిచారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటే రమేష్, బొడ్డు సురేందర్ రావు, మహమ్మద్ నాసర్, కుమార్, ఆముద లక్ష్మణ్, గొరిగి శేఖర్, బండ లింగస్వామి, కొమ్ము రామస్వామి, గంగాపురం శంకర్, మొహమ్మద్ అజార్, ఊరే శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News