Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి: మంత్రి సవిత చోళ్ళేమర్రి జాతరలో ఎంపీ పార్థసారథి సందడి “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” దారులేసిన దార్శనికుడు ఫూలే: బహుజన ఉద్యమాల మూలస్తంభం జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 08:05 PM

రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న

రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న

రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న
April 07, 2026 06:18 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈనెల 11న రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రామన్నపేట మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

జిల్లా 3వ మహాసభలను మే 18, 19 తేదీలలో రామన్నపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక స్థానం సంపాదించిన రామన్నపేట అనేక కూలీ, భూమి పోరాటాలకు కేంద్రబిందువుగా నిలిచిందన్నారు. కవులు, కళాకారులు, జానపద కళలకు ఈ ప్రాంతం నిలయమని పేర్కొన్నారు.

1936లో స్థాపితమైన వ్యవసాయ కార్మిక సంఘం భూమిలేని పేదలకు ప్రభుత్వ భూముల పంపిణీ కోసం అనేక ఉద్యమాలు చేపట్టిందని, కూలీలకు తగిన వేతనాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. జాతీయ స్థాయిలో ఉపాధి హామీ చట్టం అమలుకు కూడా సంఘం పోరాటాలు దోహదపడ్డాయని వివరించారు.

ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశానికి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News