Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:07 AM

రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న

రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న

రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న
April 07, 2026 06:18 PM 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈనెల 11న రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రామన్నపేట మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

జిల్లా 3వ మహాసభలను మే 18, 19 తేదీలలో రామన్నపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక స్థానం సంపాదించిన రామన్నపేట అనేక కూలీ, భూమి పోరాటాలకు కేంద్రబిందువుగా నిలిచిందన్నారు. కవులు, కళాకారులు, జానపద కళలకు ఈ ప్రాంతం నిలయమని పేర్కొన్నారు.

1936లో స్థాపితమైన వ్యవసాయ కార్మిక సంఘం భూమిలేని పేదలకు ప్రభుత్వ భూముల పంపిణీ కోసం అనేక ఉద్యమాలు చేపట్టిందని, కూలీలకు తగిన వేతనాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. జాతీయ స్థాయిలో ఉపాధి హామీ చట్టం అమలుకు కూడా సంఘం పోరాటాలు దోహదపడ్డాయని వివరించారు.

ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశానికి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News