Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:50 PM

రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న

రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న

రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న
07-04-2026 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈనెల 11న రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రామన్నపేట మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

జిల్లా 3వ మహాసభలను మే 18, 19 తేదీలలో రామన్నపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక స్థానం సంపాదించిన రామన్నపేట అనేక కూలీ, భూమి పోరాటాలకు కేంద్రబిందువుగా నిలిచిందన్నారు. కవులు, కళాకారులు, జానపద కళలకు ఈ ప్రాంతం నిలయమని పేర్కొన్నారు.

1936లో స్థాపితమైన వ్యవసాయ కార్మిక సంఘం భూమిలేని పేదలకు ప్రభుత్వ భూముల పంపిణీ కోసం అనేక ఉద్యమాలు చేపట్టిందని, కూలీలకు తగిన వేతనాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. జాతీయ స్థాయిలో ఉపాధి హామీ చట్టం అమలుకు కూడా సంఘం పోరాటాలు దోహదపడ్డాయని వివరించారు.

ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశానికి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ కోరారు.

Sthanikam

రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న

Article Image

రామన్నపేట,: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈనెల 11న రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రామన్నపేట మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

జిల్లా 3వ మహాసభలను మే 18, 19 తేదీలలో రామన్నపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక స్థానం సంపాదించిన రామన్నపేట అనేక కూలీ, భూమి పోరాటాలకు కేంద్రబిందువుగా నిలిచిందన్నారు. కవులు, కళాకారులు, జానపద కళలకు ఈ ప్రాంతం నిలయమని పేర్కొన్నారు.

1936లో స్థాపితమైన వ్యవసాయ కార్మిక సంఘం భూమిలేని పేదలకు ప్రభుత్వ భూముల పంపిణీ కోసం అనేక ఉద్యమాలు చేపట్టిందని, కూలీలకు తగిన వేతనాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. జాతీయ స్థాయిలో ఉపాధి హామీ చట్టం అమలుకు కూడా సంఘం పోరాటాలు దోహదపడ్డాయని వివరించారు.

ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశానికి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News