రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న
రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న
Editor Desk
రామన్నపేట,: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈనెల 11న రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రామన్నపేట మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
జిల్లా 3వ మహాసభలను మే 18, 19 తేదీలలో రామన్నపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక స్థానం సంపాదించిన రామన్నపేట అనేక కూలీ, భూమి పోరాటాలకు కేంద్రబిందువుగా నిలిచిందన్నారు. కవులు, కళాకారులు, జానపద కళలకు ఈ ప్రాంతం నిలయమని పేర్కొన్నారు.
1936లో స్థాపితమైన వ్యవసాయ కార్మిక సంఘం భూమిలేని పేదలకు ప్రభుత్వ భూముల పంపిణీ కోసం అనేక ఉద్యమాలు చేపట్టిందని, కూలీలకు తగిన వేతనాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. జాతీయ స్థాయిలో ఉపాధి హామీ చట్టం అమలుకు కూడా సంఘం పోరాటాలు దోహదపడ్డాయని వివరించారు.
ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశానికి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి