రామన్నపేటకు అసెంబ్లీ కేంద్రం హోదా ఇవ్వాలి. రాపోలు నరసింహ.
రామన్నపేటకు అసెంబ్లీ కేంద్రం హోదా ఇవ్వాలి. రాపోలు నరసింహ.
Editor Desk
అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, పునర్విభజనలో భాగంగా రామన్నపేటను అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రామన్నపేటకు మళ్లీ ఆ హోదా కల్పించాలని కోరారు.
రామన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు, డివిజన్ స్థాయి కార్యాలయాలు వంటి మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంలో కూడా నియోజకవర్గ కేంద్రంగా ఉన్న నేపథ్యం దృష్ట్యా, ప్రస్తుత పునర్విభజనలో దీనికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
రామన్నపేటను అసెంబ్లీ కేంద్రంగా ప్రకటించే వరకు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, చేనేత నాయకుడు గోసిక చక్రపాణి, బి.సెల్ మండల అధ్యక్షుడు పున్న వెంకటేశం, గజం నరసింహా తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి