Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:13 AM

రామన్నపేటకు అసెంబ్లీ కేంద్రం హోదా ఇవ్వాలి. రాపోలు నరసింహ.

రామన్నపేటకు అసెంబ్లీ కేంద్రం హోదా ఇవ్వాలి. రాపోలు నరసింహ.

రామన్నపేటకు అసెంబ్లీ కేంద్రం హోదా ఇవ్వాలి. రాపోలు నరసింహ.
April 06, 2026 03:40 PM 199 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, పునర్విభజనలో భాగంగా రామన్నపేటను అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రామన్నపేటకు మళ్లీ ఆ హోదా కల్పించాలని కోరారు.

రామన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు, డివిజన్ స్థాయి కార్యాలయాలు వంటి మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంలో కూడా నియోజకవర్గ కేంద్రంగా ఉన్న నేపథ్యం దృష్ట్యా, ప్రస్తుత పునర్విభజనలో దీనికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

రామన్నపేటను అసెంబ్లీ కేంద్రంగా ప్రకటించే వరకు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, చేనేత నాయకుడు గోసిక చక్రపాణి, బి.సెల్ మండల అధ్యక్షుడు పున్న వెంకటేశం, గజం నరసింహా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News