Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 PM

రామన్నపేటకు అసెంబ్లీ కేంద్రం హోదా ఇవ్వాలి. రాపోలు నరసింహ.

రామన్నపేటకు అసెంబ్లీ కేంద్రం హోదా ఇవ్వాలి. రాపోలు నరసింహ.

రామన్నపేటకు అసెంబ్లీ కేంద్రం హోదా ఇవ్వాలి. రాపోలు నరసింహ.
06-04-2026 207 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, పునర్విభజనలో భాగంగా రామన్నపేటను అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రామన్నపేటకు మళ్లీ ఆ హోదా కల్పించాలని కోరారు.

రామన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు, డివిజన్ స్థాయి కార్యాలయాలు వంటి మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంలో కూడా నియోజకవర్గ కేంద్రంగా ఉన్న నేపథ్యం దృష్ట్యా, ప్రస్తుత పునర్విభజనలో దీనికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

రామన్నపేటను అసెంబ్లీ కేంద్రంగా ప్రకటించే వరకు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, చేనేత నాయకుడు గోసిక చక్రపాణి, బి.సెల్ మండల అధ్యక్షుడు పున్న వెంకటేశం, గజం నరసింహా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటకు అసెంబ్లీ కేంద్రం హోదా ఇవ్వాలి. రాపోలు నరసింహ.

Article Image

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, పునర్విభజనలో భాగంగా రామన్నపేటను అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రామన్నపేటకు మళ్లీ ఆ హోదా కల్పించాలని కోరారు.

రామన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు, డివిజన్ స్థాయి కార్యాలయాలు వంటి మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంలో కూడా నియోజకవర్గ కేంద్రంగా ఉన్న నేపథ్యం దృష్ట్యా, ప్రస్తుత పునర్విభజనలో దీనికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

రామన్నపేటను అసెంబ్లీ కేంద్రంగా ప్రకటించే వరకు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, చేనేత నాయకుడు గోసిక చక్రపాణి, బి.సెల్ మండల అధ్యక్షుడు పున్న వెంకటేశం, గజం నరసింహా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News