రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కంప్యూటర్ల విరాళం.
రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కంప్యూటర్ల విరాళం.
Editor Desk
రామన్నపేట
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐడియల్ కంపెనీ సిఎస్ఆర్ నిధుల కింద 10 కంప్యూటర్లు, 4 ప్రింటర్లు అందజేశారు. కంపెనీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, జనరల్ మేనేజర్ వైద్యం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఈ పరికరాలను కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం స్వీకరించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఈ పరికరాలను అందజేశామని తెలిపారు.
ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అందించడం అత్యవసరమని పేర్కొన్నారు. అందించిన కంప్యూటర్లతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
జనరల్ మేనేజర్ వైద్యం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థానిక విద్యార్థుల అభివృద్ధికి సంస్థ తరఫున సిఎస్ఆర్ సహకారం కొనసాగుతుందని చెప్పారు.
కార్యక్రమంలో సిఎస్ఆర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, పరిపాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి