Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్యాన్సర్‌పై అవగాహన పెంపు కోసం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన:మంత్రి ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 07:24 PM

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కంప్యూటర్ల విరాళం.

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కంప్యూటర్ల విరాళం.

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కంప్యూటర్ల విరాళం.
April 22, 2026 05:21 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐడియల్ కంపెనీ సిఎస్‌ఆర్ నిధుల కింద 10 కంప్యూటర్లు, 4 ప్రింటర్లు అందజేశారు. కంపెనీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, జనరల్ మేనేజర్ వైద్యం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఈ పరికరాలను కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం స్వీకరించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఈ పరికరాలను అందజేశామని తెలిపారు.

ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అందించడం అత్యవసరమని పేర్కొన్నారు. అందించిన కంప్యూటర్లతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

జనరల్ మేనేజర్ వైద్యం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థానిక విద్యార్థుల అభివృద్ధికి సంస్థ తరఫున సిఎస్‌ఆర్ సహకారం కొనసాగుతుందని చెప్పారు.

కార్యక్రమంలో సిఎస్‌ఆర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, పరిపాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News