Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:52 PM

రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు అఖిలపక్షాల గళం

రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు అఖిలపక్షాల గళం

రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు అఖిలపక్షాల గళం
10-04-2026 235 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రద్దయిన రామన్నపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని అఖిలపక్ష పార్టీలు గట్టిగా డిమాండ్ చేశాయి. నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేటకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశాయి. స్థానిక రహదారి బంగళాలో జరిగిన అఖిలపక్ష సమావేశం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి మండలారెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకుడు గంగుల రాజిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం మాట్లాడారు. సుమారు 50 సంవత్సరాలు కొనసాగిన రామన్నపేట నియోజకవర్గం 2009లో రద్దు కావడంతో ప్రాంత అభివృద్ధి దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

రామన్నపేటలో ఇప్పటికే డివిజనల్ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో నియోజకవర్గంగా మారేందుకు అవసరమైన సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. పునరుద్ధరణ న్యాయమైన డిమాండ్ అని, ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, గ్రామాల ప్రజలు మహా పోరాటానికి సిద్ధంగా ఉండాలని నేతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కన్నెకంటి వెంకటేశ్వర చారి, టిపిసిసి అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, బిఆర్ఎస్ నాయకులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు అఖిలపక్షాల గళం

Article Image

రద్దయిన రామన్నపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని అఖిలపక్ష పార్టీలు గట్టిగా డిమాండ్ చేశాయి. నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేటకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశాయి. స్థానిక రహదారి బంగళాలో జరిగిన అఖిలపక్ష సమావేశం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి మండలారెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకుడు గంగుల రాజిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం మాట్లాడారు. సుమారు 50 సంవత్సరాలు కొనసాగిన రామన్నపేట నియోజకవర్గం 2009లో రద్దు కావడంతో ప్రాంత అభివృద్ధి దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

రామన్నపేటలో ఇప్పటికే డివిజనల్ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో నియోజకవర్గంగా మారేందుకు అవసరమైన సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. పునరుద్ధరణ న్యాయమైన డిమాండ్ అని, ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, గ్రామాల ప్రజలు మహా పోరాటానికి సిద్ధంగా ఉండాలని నేతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కన్నెకంటి వెంకటేశ్వర చారి, టిపిసిసి అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, బిఆర్ఎస్ నాయకులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News