రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు అఖిలపక్షాల గళం
రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు అఖిలపక్షాల గళం
Editor Desk
రద్దయిన రామన్నపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని అఖిలపక్ష పార్టీలు గట్టిగా డిమాండ్ చేశాయి. నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేటకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశాయి. స్థానిక రహదారి బంగళాలో జరిగిన అఖిలపక్ష సమావేశం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి మండలారెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకుడు గంగుల రాజిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం మాట్లాడారు. సుమారు 50 సంవత్సరాలు కొనసాగిన రామన్నపేట నియోజకవర్గం 2009లో రద్దు కావడంతో ప్రాంత అభివృద్ధి దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
రామన్నపేటలో ఇప్పటికే డివిజనల్ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో నియోజకవర్గంగా మారేందుకు అవసరమైన సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. పునరుద్ధరణ న్యాయమైన డిమాండ్ అని, ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, గ్రామాల ప్రజలు మహా పోరాటానికి సిద్ధంగా ఉండాలని నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కన్నెకంటి వెంకటేశ్వర చారి, టిపిసిసి అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, బిఆర్ఎస్ నాయకులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి