రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం కొనసాగిస్తామని సాధన సమితి అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య స్పష్టం చేశారు. 1952 నుంచి చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గం పునర్విభజనలో నకిరేకల్లో విలీనం కావడం అన్యాయమని అన్నారు.
2025 జూన్ 25 నుంచి అఖిలపక్షాల ఆధ్వర్యంలో వందకు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మద్దతుతో ఉద్యమం కొనసాగిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలను కలుపుకొని రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి