రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్.
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్.
Editor Desk
ప్రజల ఏకగళం… రణభేరి మోగించిన సాధన సమితి
రామన్నపేటను మళ్లీ శాసనసభ నియోజకవర్గంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రజల్లో ఉద్యమ జోరు పెరుగుతోంది. ఈ మేరకు రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ప్రచార కార్యదర్శి జెట్టి శివ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గంగా ఉన్న రామన్నపేటను తరువాత తొలగించడంతో, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంత ప్రజలు అనేక పరిపాలనా, అభివృద్ధి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రామన్నపేట ప్రాంత ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రాలు దూరంగా ఉండడం వల్ల ప్రభుత్వ సేవలు అందుకోవడం కష్టంగా మారిందని, అభివృద్ధి అసమానంగా జరుగుతోందని విమర్శించారు. అదేవిధంగా ప్రజలకు సరైన రాజకీయ ప్రతినిధిత్వం లేకపోవడం, గ్రామీణ అవసరాలు పట్టించుకోబడకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో రామన్నపేటకు ప్రత్యేక శాసనసభ నియోజకవర్గ హోదా మళ్లీ కల్పించి, ప్రజలకు సమర్థవంతమైన పరిపాలన అందించాలని డిమాండ్ చేశారు.
“రామన్నపేట నియోజకవర్గం మా హక్కు… సాధించేదాకా పోరాటం ఆగదు” అంటూ ఆయన స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి