Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సత్తుపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల నియామక సన్నాహక సమావేశం నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 01:53 PM

రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు కోరుతూ సీఐ, ఎస్ఐలకు సన్మానం.

రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు కోరుతూ సీఐ, ఎస్ఐలకు సన్మానం.

రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు కోరుతూ సీఐ, ఎస్ఐలకు సన్మానం.
April 07, 2026 02:01 PM 179 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంత చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, మౌలిక సదుపాయాలను అధికారులకు వివరించారు.

నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా పాత రామన్నపేట నియోజకవర్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని సమితి నాయకులు కోరారు. నియోజకవర్గ ఏర్పాటుకు అవసరమైన అన్ని కార్యాలయాలు, వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంలో అధికారుల సహకారం కీలకమని పేర్కొన్నారు.

ఈ క్రమంలో రామన్నపేట సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్ ఐ డి. నాగరాజులను సన్మానిస్తూ నియోజకవర్గ సాధనలో తమ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎర్ర రమేష్ గౌడ్, ఎస్కే చాంద్, నాయకులు పోతరాజు శంకరయ్య, వరికల్ గోపాల్, ఎండి ఫజల్, గంగాపురం యాదయ్య, గడ్డం యాదగిరి, డాక్టర్ నకిరేకంటి అశోక్, ఏలూరు రవి, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్, బర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News