రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు కోరుతూ సీఐ, ఎస్ఐలకు సన్మానం.
రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు కోరుతూ సీఐ, ఎస్ఐలకు సన్మానం.
Editor Desk
రామన్నపేట: ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంత చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, మౌలిక సదుపాయాలను అధికారులకు వివరించారు.
నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా పాత రామన్నపేట నియోజకవర్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని సమితి నాయకులు కోరారు. నియోజకవర్గ ఏర్పాటుకు అవసరమైన అన్ని కార్యాలయాలు, వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంలో అధికారుల సహకారం కీలకమని పేర్కొన్నారు.
ఈ క్రమంలో రామన్నపేట సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్ ఐ డి. నాగరాజులను సన్మానిస్తూ నియోజకవర్గ సాధనలో తమ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎర్ర రమేష్ గౌడ్, ఎస్కే చాంద్, నాయకులు పోతరాజు శంకరయ్య, వరికల్ గోపాల్, ఎండి ఫజల్, గంగాపురం యాదయ్య, గడ్డం యాదగిరి, డాక్టర్ నకిరేకంటి అశోక్, ఏలూరు రవి, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్, బర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి