Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:17 AM

రామన్నపేట ఆసుపత్రిని 100 పడకలుగా మార్చాలి – సిపిఎం

రామన్నపేట ఆసుపత్రిని 100 పడకలుగా మార్చాలి – సిపిఎం

రామన్నపేట ఆసుపత్రిని 100 పడకలుగా మార్చాలి – సిపిఎం
March 10, 2026 06:03 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి, రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించి నూతన భవనం నిర్మించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 16 నుంచి సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

స్థానిక రావనపేట రహదారి బంగ్లాలో అఖిలపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి నిరాహార దీక్షల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 60 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ ఆసుపత్రి పరిసర మండలాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ ప్రస్తుతం అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. రోజుకు సుమారు 400 మంది అవుట్‌పేషెంట్లు వస్తున్నప్పటికీ తగినంత మంది వైద్యులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో కూడా సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ఏరియా ఆసుపత్రిగా బోర్డు పెట్టి 15 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ 30 పడకలకే పరిమితమైందని విమర్శించారు. వెంటనే బడ్జెట్ సమావేశాల్లో వంద పడకల ఆసుపత్రికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, లేకపోతే మండల వ్యాప్తంగా ప్రజలను సమీకరించి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో టీడీపీ నాయకులు ఫజల్ బేగ్, సిపిఐ నాయకులు రచ్చ యాదగిరి, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు నోముల చిరంజీవి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్, బోయిని ఆనంద్, కందుల హనుమతు, గొరిగే సోములు, గన్నేబోయిన విజయభాస్కర్, ఎండీ రషీద్, బావండ్లపల్లి బాలరాజు, బోడిగే రజిత, మునికుంట్ల లెనిన్, ఆవనగంటి స్వామి, గంటెపాక శివకుమార్, గట్టు నర్సింహా, పల్లె సత్యం, మేడి గణేష్, పుట్టల ఉదయ్, శానగొండ రామచంద్రం, గోగు లింగస్వామి, శానగొండ వెంకటేశ్వర్లు, పెండెం భ్రహ్మయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News