రామన్నపేట అభివృద్ధి శిల్పి – పురుషోత్తం రెడ్డి సేవలు చిరస్మరణీయం.కంభంపాటి శ్రీనివాసులు గౌడ్
రామన్నపేట అభివృద్ధి శిల్పి – పురుషోత్తం రెడ్డి సేవలు చిరస్మరణీయం.కంభంపాటి శ్రీనివాసులు గౌడ్
Editor Desk
రామన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ప్రముఖ నాయకుల్లో ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి ఒకరని రామన్నపేట సాధన సమితి గౌరవ అధ్యక్షులు, పలివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ పేర్కొన్నారు.
పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, సాధన సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పురుషోత్తం రెడ్డి చరిత్రను తెలుసుకోవడం ఎంతో ప్రేరణనిస్తుందని అన్నారు.
1933లో యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో జన్మించిన పురుషోత్తం రెడ్డి, గ్రామ సర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, తరువాత రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్గా కీలక పదవులు నిర్వహించారు.
1947లో కాంగ్రెస్ పార్టీలో చేరి, హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1969–72 మధ్య చిన్ననాటి వనరుల శాఖ మంత్రిగా, 1974–77 మధ్య ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.
తన పదవీకాలంలో రామన్నపేటలో డిగ్రీ కళాశాల, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం, ఫైర్ స్టేషన్, ఏరియా ఆసుపత్రి వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి