Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 11:16 AM

రాజగోపాల్ రెడ్డి పోరాటానికే దక్కిన ఫలితం

రాజగోపాల్ రెడ్డి పోరాటానికే దక్కిన ఫలితం

రాజగోపాల్ రెడ్డి పోరాటానికే దక్కిన ఫలితం
April 22, 2026 09:18 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ బస్టాండ్ వద్ద వెహికల్ అండర్‌పాస్ మంజూరు

మార్కింగ్ పూర్తి చేసిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన పెద్దగోని రమేష్ గౌడ్

చౌటుప్పల్ పట్టణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. జాతీయ రహదారిపై నిర్మితమవుతున్న ఫ్లైఓవర్ పనుల్లో భాగంగా, బస్టాండ్ సమీపంలో వెహికల్ అండర్‌పాస్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్ అన్నారు.​స్థానిక ప్రజల అవసరాలను గుర్తించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. రీజనల్ ఆఫీసర్ శివశంకర్, పీడీ శ్రీనివాస్, ఫ్లైఓవర్ ఇంచార్జ్ సైఫీ తదితర అధికారులకు క్షేత్రస్థాయి ఇబ్బందులను వివరించారు. చౌటుప్పల్ లో పిల్లర్లతో కూడిన ఫ్లైఓవర్ లేదా బస్టాండ్ వద్ద వెహికల్ అండర్‌పాస్ తప్పనిసరి అని ఆయన పట్టుబట్టారు.20 మీటర్ల వెడల్పుతో నిర్మాణం ఎమ్మెల్యే వినతికి సానుకూలంగా స్పందించిన అధికారులు, బస్టాండ్ పరిధిలోని బాలాజీ స్వీట్ హౌస్ ఎదురుగా 20 మీటర్ల వెడల్పుతో అండర్‌పాస్ నిర్మించేందుకు అంగీకరించారు. ఈ మేరకు బుధవారం అధికారులు క్షేత్రస్థాయిలో మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.​"చౌటుప్పల్ పట్టణ అభివృద్ధిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఉన్న చిత్తశుద్ధికి ఈ అండర్‌పాస్ మంజూరు నిదర్శనం. ప్రజల ఇబ్బందులను గుర్తించి అధికారులపై ఒత్తిడి తెచ్చి దీనిని సాధించినందుకు పట్టణ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News