రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
Sthanikam District Staff Reporter
- భువనగిరి వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ శ్రీ రేఖ బాబు రావ్
భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం,రెడ్డి నాయక్ తండ,పచ్చర్లబోడుతండా,సూరేపల్లి,ఆకు తోట బావి తండ,బొల్లేపల్లి,నందనం,నామాత్ పల్లి గ్రామంలో ఐకెపీ ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించిన.భువనగిరి వ్యసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీ రేఖ బాబు రావ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు.రైతులు పండించిన వరి ధాన్యాన్ని సరైన ధరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పీ) ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తాగునీరు,తూకం యంత్రాలు,గన్నీ సంచులు,రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని శుభ్రంగా,తేమ శాతం సరైన స్థాయిలో ఉంచి తీసుకురావాలని సూచించారు.ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరితగతిన జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వవ్వసాయా అధికారులు మరియు మార్కెట్ కమిటీ డైరక్టర్లు చిన్నం శ్రీను,పిట్టల రజిత,ఆయా గ్రామాల సర్పంచులు,వాడుమెంబర్లు ,మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణ రెడ్డి,డీసీసీ వైస్ ప్రసిడెంట్ చుక్క స్వామి,బ్లాక్ ప్రెసిడెంట్ చిక్కుల వెంకటేశ్,కాంగ్రెస్ నాయకులు రావి సురేష్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్ల,మండల అధ్యక్షులు మంగ ప్రవీణ్,కనకుంట్ల కొండల్,మాజీ మండల ఏలంలా జంగయ్య,బొల్లేపల్లి అశోక్,బింగి భిక్షపతి,పిట్టల వెంకటేష్,రమేష్ నాయక్,నర్సింహ నాయక్ రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి