Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:21 PM

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
April 24, 2026 09:05 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- భువనగిరి వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ శ్రీ రేఖ బాబు రావ్

భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం,రెడ్డి నాయక్ తండ,పచ్చర్లబోడుతండా,సూరేపల్లి,ఆకు తోట బావి తండ,బొల్లేపల్లి,నందనం,నామాత్ పల్లి గ్రామంలో ఐకెపీ ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించిన.భువనగిరి వ్యసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీ రేఖ బాబు రావ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు.రైతులు పండించిన వరి ధాన్యాన్ని సరైన ధరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పీ) ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తాగునీరు,తూకం యంత్రాలు,గన్నీ సంచులు,రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని శుభ్రంగా,తేమ శాతం సరైన స్థాయిలో ఉంచి తీసుకురావాలని సూచించారు.ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరితగతిన జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వవ్వసాయా అధికారులు మరియు మార్కెట్ కమిటీ డైరక్టర్లు చిన్నం శ్రీను,పిట్టల రజిత,ఆయా గ్రామాల సర్పంచులు,వాడుమెంబర్లు ,మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణ రెడ్డి,డీసీసీ వైస్ ప్రసిడెంట్ చుక్క స్వామి,బ్లాక్ ప్రెసిడెంట్ చిక్కుల వెంకటేశ్,కాంగ్రెస్ నాయకులు రావి సురేష్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్ల,మండల అధ్యక్షులు మంగ ప్రవీణ్,కనకుంట్ల కొండల్,మాజీ మండల ఏలంలా జంగయ్య,బొల్లేపల్లి అశోక్,బింగి భిక్షపతి,పిట్టల వెంకటేష్,రమేష్ నాయక్,నర్సింహ నాయక్ రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News