Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:54 PM

రైతు సంఘం జెండా ఆవిష్కరణ

రైతు సంఘం జెండా ఆవిష్కరణ

రైతు సంఘం జెండా ఆవిష్కరణ
April 11, 2026 05:10 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పిలుపుమేరకు ఆదోని మండలం 104 బసాపురం గ్రామంలో రైతు సంఘం జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం కార్యదర్శి బసాపురం గోపాల్ నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి. సత్యనారాయణ, సిపిఐ మండల కార్యదర్శి బిజీ ఎల్లప్ప మాట్లాడుతూ 1936లో లక్నోలో స్థాపితమైన రైతు సంఘం 90 ఏళ్లుగా రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడుతోందని తెలిపారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేసిన చరిత్ర రైతు సంఘానిదని పేర్కొన్నారు.

మహాకూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. వెంటనే “సూపర్ సిక్స్” హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులు పండించే పంటలకు ముందుగానే ధర ప్రకటించాలని, కల్తీ ఎరువులు, మందులను అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గుళ్లం సమీపంలో లిఫ్ట్ ఇరిగేషన్, మలగవల్లి–నగరడం ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు, గ్రామ రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News