Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:41 PM

రైతు సంఘం జెండా ఆవిష్కరణ

రైతు సంఘం జెండా ఆవిష్కరణ

రైతు సంఘం జెండా ఆవిష్కరణ
11-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పిలుపుమేరకు ఆదోని మండలం 104 బసాపురం గ్రామంలో రైతు సంఘం జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం కార్యదర్శి బసాపురం గోపాల్ నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి. సత్యనారాయణ, సిపిఐ మండల కార్యదర్శి బిజీ ఎల్లప్ప మాట్లాడుతూ 1936లో లక్నోలో స్థాపితమైన రైతు సంఘం 90 ఏళ్లుగా రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడుతోందని తెలిపారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేసిన చరిత్ర రైతు సంఘానిదని పేర్కొన్నారు.

మహాకూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. వెంటనే “సూపర్ సిక్స్” హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులు పండించే పంటలకు ముందుగానే ధర ప్రకటించాలని, కల్తీ ఎరువులు, మందులను అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గుళ్లం సమీపంలో లిఫ్ట్ ఇరిగేషన్, మలగవల్లి–నగరడం ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు, గ్రామ రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రైతు సంఘం జెండా ఆవిష్కరణ

Article Image

ఆదోని: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పిలుపుమేరకు ఆదోని మండలం 104 బసాపురం గ్రామంలో రైతు సంఘం జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం కార్యదర్శి బసాపురం గోపాల్ నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి. సత్యనారాయణ, సిపిఐ మండల కార్యదర్శి బిజీ ఎల్లప్ప మాట్లాడుతూ 1936లో లక్నోలో స్థాపితమైన రైతు సంఘం 90 ఏళ్లుగా రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడుతోందని తెలిపారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేసిన చరిత్ర రైతు సంఘానిదని పేర్కొన్నారు.

మహాకూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. వెంటనే “సూపర్ సిక్స్” హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులు పండించే పంటలకు ముందుగానే ధర ప్రకటించాలని, కల్తీ ఎరువులు, మందులను అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గుళ్లం సమీపంలో లిఫ్ట్ ఇరిగేషన్, మలగవల్లి–నగరడం ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు, గ్రామ రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News