రైతు సంఘం జెండా ఆవిష్కరణ
రైతు సంఘం జెండా ఆవిష్కరణ
Editor Desk
ఆదోని: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పిలుపుమేరకు ఆదోని మండలం 104 బసాపురం గ్రామంలో రైతు సంఘం జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం కార్యదర్శి బసాపురం గోపాల్ నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి. సత్యనారాయణ, సిపిఐ మండల కార్యదర్శి బిజీ ఎల్లప్ప మాట్లాడుతూ 1936లో లక్నోలో స్థాపితమైన రైతు సంఘం 90 ఏళ్లుగా రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడుతోందని తెలిపారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేసిన చరిత్ర రైతు సంఘానిదని పేర్కొన్నారు.
మహాకూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. వెంటనే “సూపర్ సిక్స్” హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులు పండించే పంటలకు ముందుగానే ధర ప్రకటించాలని, కల్తీ ఎరువులు, మందులను అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గుళ్లం సమీపంలో లిఫ్ట్ ఇరిగేషన్, మలగవల్లి–నగరడం ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు, గ్రామ రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి