Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 07:06 PM

రైతు సంఘం జెండా ఆవిష్కరణ

రైతు సంఘం జెండా ఆవిష్కరణ

రైతు సంఘం జెండా ఆవిష్కరణ
April 11, 2026 05:10 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పిలుపుమేరకు ఆదోని మండలం 104 బసాపురం గ్రామంలో రైతు సంఘం జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం కార్యదర్శి బసాపురం గోపాల్ నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి. సత్యనారాయణ, సిపిఐ మండల కార్యదర్శి బిజీ ఎల్లప్ప మాట్లాడుతూ 1936లో లక్నోలో స్థాపితమైన రైతు సంఘం 90 ఏళ్లుగా రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడుతోందని తెలిపారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేసిన చరిత్ర రైతు సంఘానిదని పేర్కొన్నారు.

మహాకూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. వెంటనే “సూపర్ సిక్స్” హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులు పండించే పంటలకు ముందుగానే ధర ప్రకటించాలని, కల్తీ ఎరువులు, మందులను అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గుళ్లం సమీపంలో లిఫ్ట్ ఇరిగేషన్, మలగవల్లి–నగరడం ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు, గ్రామ రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News