Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:51 PM

రైల్వే ట్రాక్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటుకు నష్టపరిహారం ఇవ్వాలి

రైల్వే ట్రాక్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటుకు నష్టపరిహారం ఇవ్వాలి

రైల్వే ట్రాక్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటుకు నష్టపరిహారం ఇవ్వాలి
April 10, 2026 08:07 PM 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలం,

నడికుడి–బీబీనగర్ రెండో రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.1.50 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు.

శుక్రవారం మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో నిర్వహించిన సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ… తరతరాలుగా భూమిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు ప్రభుత్వ అవసరాల పేరుతో భూములు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భూములు స్వాధీనం చేసుకునే ముందు ప్రభుత్వం హామీలు ఇస్తున్నప్పటికీ, తర్వాత తగిన నష్టపరిహారం చెల్లించడంలో విఫలమవుతోందని విమర్శించారు. అనాజిపురంలో ఎకరం భూమి మార్కెట్ విలువ రూ.1.50 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్ రేటు ప్రకారం కేవలం రూ.22 లక్షలు మాత్రమే చెల్లించడం అన్యాయమని ప్రశ్నించారు.

ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఇతర ప్రాంతాల్లో కనీసం 10 గుంటల భూమి కొనుగోలు చేయడానికి కూడా సరిపోదని అన్నారు. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మార్కెట్ రేటుకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి రైల్వే శాఖలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా, మండల నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News