రైల్వే ట్రాక్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటుకు నష్టపరిహారం ఇవ్వాలి
రైల్వే ట్రాక్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటుకు నష్టపరిహారం ఇవ్వాలి
Editor Desk
భువనగిరి మండలం,
నడికుడి–బీబీనగర్ రెండో రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.1.50 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు.
శుక్రవారం మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో నిర్వహించిన సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ… తరతరాలుగా భూమిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు ప్రభుత్వ అవసరాల పేరుతో భూములు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భూములు స్వాధీనం చేసుకునే ముందు ప్రభుత్వం హామీలు ఇస్తున్నప్పటికీ, తర్వాత తగిన నష్టపరిహారం చెల్లించడంలో విఫలమవుతోందని విమర్శించారు. అనాజిపురంలో ఎకరం భూమి మార్కెట్ విలువ రూ.1.50 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్ రేటు ప్రకారం కేవలం రూ.22 లక్షలు మాత్రమే చెల్లించడం అన్యాయమని ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఇతర ప్రాంతాల్లో కనీసం 10 గుంటల భూమి కొనుగోలు చేయడానికి కూడా సరిపోదని అన్నారు. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మార్కెట్ రేటుకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి రైల్వే శాఖలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా, మండల నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి