Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:42 PM

పూలే ఉత్సవ కమిటీకి కన్వీనర్‌గా మోదీరాందేవ్

పూలే ఉత్సవ కమిటీకి కన్వీనర్‌గా మోదీరాందేవ్

పూలే ఉత్సవ కమిటీకి కన్వీనర్‌గా మోదీరాందేవ్
April 10, 2026 05:31 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవ కమిటీకి చైర్మన్‌గా మాజీ ఎంపీ వి.హెచ్. హనుమంతరావు, వైస్ చైర్మన్‌లతో పాటు కన్వీనర్‌గా పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్‌ను నియమిస్తూ శుక్రవారం జీవో నెం.174 జారీ చేసింది.

ఈ సందర్భంగా మోదీరాందేవ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే వంటి మహనీయుని జయంతి ఉత్సవ కమిటీలో చోటు దక్కడం తనకు గౌరవంగా భావిస్తున్నానన్నారు. గత 16 సంవత్సరాలుగా విద్యార్థుల హక్కుల కోసం తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిని గుర్తించి తనను కన్వీనర్‌గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్, కమిటీ చైర్మన్ వి.హెచ్. హనుమంతరావు సహా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఏప్రిల్ 11న హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సహా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో జరిగే జయంతి ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News