పూలే ఉత్సవ కమిటీకి కన్వీనర్గా మోదీరాందేవ్
పూలే ఉత్సవ కమిటీకి కన్వీనర్గా మోదీరాందేవ్
Editor Desk
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవ కమిటీకి చైర్మన్గా మాజీ ఎంపీ వి.హెచ్. హనుమంతరావు, వైస్ చైర్మన్లతో పాటు కన్వీనర్గా పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ను నియమిస్తూ శుక్రవారం జీవో నెం.174 జారీ చేసింది.
ఈ సందర్భంగా మోదీరాందేవ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే వంటి మహనీయుని జయంతి ఉత్సవ కమిటీలో చోటు దక్కడం తనకు గౌరవంగా భావిస్తున్నానన్నారు. గత 16 సంవత్సరాలుగా విద్యార్థుల హక్కుల కోసం తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిని గుర్తించి తనను కన్వీనర్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్, కమిటీ చైర్మన్ వి.హెచ్. హనుమంతరావు సహా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఏప్రిల్ 11న హైదరాబాద్లోని రవీంద్రభారతి సహా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో జరిగే జయంతి ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి