PRINT TIME: April 22, 2026 10:34 AM
పోలీసుల ఆధీనంలో నల్గొండ బస్ డిపో
పోలీసుల ఆధీనంలో నల్గొండ బస్ డిపో
April 22, 2026 08:51 AM
31 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్గొండ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నల్గొండ బస్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాల దృష్ట్యా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే పోలీస్ బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టారు.
డిపో ఆవరణను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఆందోళనకారులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. బస్సుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లాలోని 7 రీజియన్ల పరిధిలో సుమారు 702 బస్సులు నిలిచిపోనున్నట్లు సమాచారం. సమ్మె ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి