Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 11:23 PM

ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగం పెంచాలి పోషకాహార లోపాల నివారణకు కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు

ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగం పెంచాలి పోషకాహార లోపాల నివారణకు కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు

ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగం పెంచాలి పోషకాహార లోపాల నివారణకు కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు
February 25, 2026 06:57 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: జిల్లాలో పోషకాహార భద్రత బలోపేతానికి ఆహార పదార్థాల ఫోర్టిఫికేషన్‌పై కలెక్టరేట్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మిల్లర్ల సంఘ ప్రతినిధులు, అంగన్‌వాడీ సంఘ అధ్యక్షులు, రిటైల్ దుకాణదారులు పాల్గొన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మనోహర్ మాట్లాడుతూ… ప్రజల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ–12తో సమృద్ధిగా తయారు చేసిన ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగం అత్యంత అవసరమని వివరించారు. రక్తహీనత వంటి సమస్యలను తగ్గించడంలో ఇది కీలకమన్నారు.

జిల్లా పౌర సరఫరాల అధికారి రోజా మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాల ద్వారా సరఫరా అవుతున్న ఫోర్టిఫైడ్ బియ్యం ప్రయోజనాలను వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, సంక్షేమ హాస్టళ్ల ద్వారా పంపిణీ జరుగుతున్న విధానాన్ని తెలియజేశారు.

జిల్లా సంక్షేమాధికారి నర్సింగ్ రావు మాట్లాడుతూ… అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో ఫోర్టిఫైడ్ ఆహారం అందించడం ద్వారా బాలల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. గెజిటెడ్ ఇన్‌స్పెక్టర్ స్వాతి, ఆహార భద్రత అధికారి శివశంకర్ రెడ్డి ఫోర్టిఫికేషన్ అమలు విధానం, నాణ్యత నియంత్రణ, చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.

ఫోర్టిఫికేషన్ శిక్షకుడు డా. ఆంజనేయులు చాగంటి శాస్త్రీయ ప్రాముఖ్యతను వివరించి, మిల్లర్లు పాటించాల్సిన సాంకేతిక మార్గదర్శకాలను వివరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News