ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పోరుబాట బీఆర్ఎస్వి పోస్టర్ ఆవిష్కరణ
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పోరుబాట బీఆర్ఎస్వి పోస్టర్ ఆవిష్కరణ
Editor Desk
నల్గొండ,
నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Bommaraboyina Nagarjuna హాజరై పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థి నాయకత్వం, సామాజిక సేవ పట్ల నిబద్ధత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల సాధనలో బీఆర్ఎస్వి కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు నినాదాలతో కార్యక్రమాన్ని కొనసాగించారు. రాబోయే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నోముల క్రాంతి యాదవ్, బకరం నరేందర్, ఎర్ర స్వామి, వెంకటేష్, అశోక్, సురేష్, వంశీ, కిరణ్, పరమేష్ తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి