Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:58 PM

ఫీజు బకాయిల విడుదలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల ముట్టడి పిలుపు

ఫీజు బకాయిల విడుదలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల ముట్టడి పిలుపు

ఫీజు బకాయిల విడుదలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల ముట్టడి పిలుపు
April 08, 2026 04:15 PM 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల ముట్టడిని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు.

బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి విద్యార్థుల సంక్షేమమే లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌ల విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

హైకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని ప్రైవేటు కళాశాలలు విద్యార్థుల నుంచి నిర్బంధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీనివల్ల పేద విద్యార్థులపై భారం పెరిగిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఫీజు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి విద్యార్థులను చేర్చుకున్న యాజమాన్యాలు, ఇప్పుడు కొత్త నిబంధనల పేరిట అదనపు ఫీజులు వసూలు చేయడం తగదన్నారు.

ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీని ప్రభావంతో కొంతమంది విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల ముందు మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News