ఫార్మా ఎగుమతులకు పూర్తి మద్దతు.. రాజేష్ అగర్వాల్ హామీ
ఫార్మా ఎగుమతులకు పూర్తి మద్దతు.. రాజేష్ అగర్వాల్ హామీ
Editor Desk
దేశంలో ఫార్మా రంగ అభివృద్ధికి, ఎగుమతుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ‘చింతన్ శివిర్’లో ఆయన మాట్లాడుతూ ఈ హామీ ఇచ్చారు.
భారత్ ప్రపంచానికి ‘ఫార్మసీ’గా ఎదిగిందని, జెనరిక్ ఔషధాల్లో దేశం అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఫార్మా రంగం ప్రస్తుతం సుమారు 60 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉండగా, దాదాపు 50 శాతం ఆదాయం ఎగుమతుల ద్వారానే వస్తోందన్నారు.
దేశీయ అవసరాల్లో అధిక శాతం స్వదేశీ ఉత్పత్తుల ద్వారానే తీర్చుకోవాలని, ఏపీఐలు, బల్క్ డ్రగ్స్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యత ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేసి అంతర్జాతీయ నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.
పరిశ్రమను పరిమాణం నుంచి విలువ ఆధారిత దిశగా తీసుకెళ్లాలని, బయోలాజిక్స్, బయోసిమిలర్స్ రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సరఫరా గొలుసులను బలోపేతం చేయడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ఈ చింతన్ శివిర్లో ఎగుమతిదారులతో ముఖాముఖి చర్చలు జరిపి, వారి సమస్యలు, సూచనలను స్వీకరించారు. ఫార్మా రంగ పోటీతత్వాన్ని పెంచేందుకు అవసరమైన విధానపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి