Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:14 PM

ఫార్మా ఎగుమతులకు పూర్తి మద్దతు.. రాజేష్ అగర్వాల్ హామీ

ఫార్మా ఎగుమతులకు పూర్తి మద్దతు.. రాజేష్ అగర్వాల్ హామీ

ఫార్మా ఎగుమతులకు పూర్తి మద్దతు.. రాజేష్ అగర్వాల్ హామీ
04-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దేశంలో ఫార్మా రంగ అభివృద్ధికి, ఎగుమతుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చింతన్ శివిర్’లో ఆయన మాట్లాడుతూ ఈ హామీ ఇచ్చారు.

భారత్ ప్రపంచానికి ‘ఫార్మసీ’గా ఎదిగిందని, జెనరిక్ ఔషధాల్లో దేశం అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఫార్మా రంగం ప్రస్తుతం సుమారు 60 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉండగా, దాదాపు 50 శాతం ఆదాయం ఎగుమతుల ద్వారానే వస్తోందన్నారు.

దేశీయ అవసరాల్లో అధిక శాతం స్వదేశీ ఉత్పత్తుల ద్వారానే తీర్చుకోవాలని, ఏపీఐలు, బల్క్ డ్రగ్స్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యత ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేసి అంతర్జాతీయ నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.

పరిశ్రమను పరిమాణం నుంచి విలువ ఆధారిత దిశగా తీసుకెళ్లాలని, బయోలాజిక్స్, బయోసిమిలర్స్ రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సరఫరా గొలుసులను బలోపేతం చేయడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

ఈ చింతన్ శివిర్‌లో ఎగుమతిదారులతో ముఖాముఖి చర్చలు జరిపి, వారి సమస్యలు, సూచనలను స్వీకరించారు. ఫార్మా రంగ పోటీతత్వాన్ని పెంచేందుకు అవసరమైన విధానపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Sthanikam

ఫార్మా ఎగుమతులకు పూర్తి మద్దతు.. రాజేష్ అగర్వాల్ హామీ

Article Image

దేశంలో ఫార్మా రంగ అభివృద్ధికి, ఎగుమతుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చింతన్ శివిర్’లో ఆయన మాట్లాడుతూ ఈ హామీ ఇచ్చారు.

భారత్ ప్రపంచానికి ‘ఫార్మసీ’గా ఎదిగిందని, జెనరిక్ ఔషధాల్లో దేశం అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఫార్మా రంగం ప్రస్తుతం సుమారు 60 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉండగా, దాదాపు 50 శాతం ఆదాయం ఎగుమతుల ద్వారానే వస్తోందన్నారు.

దేశీయ అవసరాల్లో అధిక శాతం స్వదేశీ ఉత్పత్తుల ద్వారానే తీర్చుకోవాలని, ఏపీఐలు, బల్క్ డ్రగ్స్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యత ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేసి అంతర్జాతీయ నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.

పరిశ్రమను పరిమాణం నుంచి విలువ ఆధారిత దిశగా తీసుకెళ్లాలని, బయోలాజిక్స్, బయోసిమిలర్స్ రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సరఫరా గొలుసులను బలోపేతం చేయడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

ఈ చింతన్ శివిర్‌లో ఎగుమతిదారులతో ముఖాముఖి చర్చలు జరిపి, వారి సమస్యలు, సూచనలను స్వీకరించారు. ఫార్మా రంగ పోటీతత్వాన్ని పెంచేందుకు అవసరమైన విధానపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News