Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు చేతిలో రూ. 40, అకౌంట్‌లో రూ. 44… కేవలం రూ. 84 ఆస్తితో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి ఆష్నా తంపి సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 04, 2026 08:34 PM

ఫార్మా ఎగుమతులకు పూర్తి మద్దతు.. రాజేష్ అగర్వాల్ హామీ

ఫార్మా ఎగుమతులకు పూర్తి మద్దతు.. రాజేష్ అగర్వాల్ హామీ

ఫార్మా ఎగుమతులకు పూర్తి మద్దతు.. రాజేష్ అగర్వాల్ హామీ
April 04, 2026 06:14 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దేశంలో ఫార్మా రంగ అభివృద్ధికి, ఎగుమతుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చింతన్ శివిర్’లో ఆయన మాట్లాడుతూ ఈ హామీ ఇచ్చారు.

భారత్ ప్రపంచానికి ‘ఫార్మసీ’గా ఎదిగిందని, జెనరిక్ ఔషధాల్లో దేశం అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఫార్మా రంగం ప్రస్తుతం సుమారు 60 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉండగా, దాదాపు 50 శాతం ఆదాయం ఎగుమతుల ద్వారానే వస్తోందన్నారు.

దేశీయ అవసరాల్లో అధిక శాతం స్వదేశీ ఉత్పత్తుల ద్వారానే తీర్చుకోవాలని, ఏపీఐలు, బల్క్ డ్రగ్స్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యత ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేసి అంతర్జాతీయ నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.

పరిశ్రమను పరిమాణం నుంచి విలువ ఆధారిత దిశగా తీసుకెళ్లాలని, బయోలాజిక్స్, బయోసిమిలర్స్ రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సరఫరా గొలుసులను బలోపేతం చేయడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

ఈ చింతన్ శివిర్‌లో ఎగుమతిదారులతో ముఖాముఖి చర్చలు జరిపి, వారి సమస్యలు, సూచనలను స్వీకరించారు. ఫార్మా రంగ పోటీతత్వాన్ని పెంచేందుకు అవసరమైన విధానపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News