Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు పాల్గొని సహకరించాలి:చింత గోపాల్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 09:51 PM

పెట్రోల్‌, డీజిల్ కొరతతో కష్టాలు రామన్నపేటలో మూతపడ్డ బంకులు.. క్యూలలో ప్రజలు

పెట్రోల్‌, డీజిల్ కొరతతో కష్టాలు రామన్నపేటలో మూతపడ్డ బంకులు.. క్యూలలో ప్రజలు

పెట్రోల్‌, డీజిల్ కొరతతో కష్టాలు రామన్నపేటలో మూతపడ్డ బంకులు.. క్యూలలో ప్రజలు
April 27, 2026 02:15 PM 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలో పెట్రోల్‌, డీజిల్ కొరత తీవ్రమైంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఇంధన సమస్య సోమవారం నాటికి మరింత ఉధృతమైంది. కంపెనీల నుంచి సరఫరా తగ్గిపోవడంతో మండలంలోని పలు పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించాయి.

ఇంధనం అందుబాటులో లేకపోవడంతో కొన్ని బంకులు పూర్తిగా మూతపడగా, స్టాక్ ఉన్న బంకుల వద్ద మాత్రం వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పనులు వదిలి ఇంధనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పనులు కూడా ఆలస్యమవుతున్నాయి.

ఇంధన కొరతపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పౌరసరఫరాల శాఖ వెంటనే స్పందించి సరఫరాను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News