Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:15 AM

పెట్రోల్‌, డీజిల్ కొరతతో కష్టాలు రామన్నపేటలో మూతపడ్డ బంకులు.. క్యూలలో ప్రజలు

పెట్రోల్‌, డీజిల్ కొరతతో కష్టాలు రామన్నపేటలో మూతపడ్డ బంకులు.. క్యూలలో ప్రజలు

పెట్రోల్‌, డీజిల్ కొరతతో కష్టాలు రామన్నపేటలో మూతపడ్డ బంకులు.. క్యూలలో ప్రజలు
27-04-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలో పెట్రోల్‌, డీజిల్ కొరత తీవ్రమైంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఇంధన సమస్య సోమవారం నాటికి మరింత ఉధృతమైంది. కంపెనీల నుంచి సరఫరా తగ్గిపోవడంతో మండలంలోని పలు పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించాయి.

ఇంధనం అందుబాటులో లేకపోవడంతో కొన్ని బంకులు పూర్తిగా మూతపడగా, స్టాక్ ఉన్న బంకుల వద్ద మాత్రం వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పనులు వదిలి ఇంధనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పనులు కూడా ఆలస్యమవుతున్నాయి.

ఇంధన కొరతపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పౌరసరఫరాల శాఖ వెంటనే స్పందించి సరఫరాను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

పెట్రోల్‌, డీజిల్ కొరతతో కష్టాలు రామన్నపేటలో మూతపడ్డ బంకులు.. క్యూలలో ప్రజలు

Article Image

రామన్నపేట: మండలంలో పెట్రోల్‌, డీజిల్ కొరత తీవ్రమైంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఇంధన సమస్య సోమవారం నాటికి మరింత ఉధృతమైంది. కంపెనీల నుంచి సరఫరా తగ్గిపోవడంతో మండలంలోని పలు పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించాయి.

ఇంధనం అందుబాటులో లేకపోవడంతో కొన్ని బంకులు పూర్తిగా మూతపడగా, స్టాక్ ఉన్న బంకుల వద్ద మాత్రం వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పనులు వదిలి ఇంధనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పనులు కూడా ఆలస్యమవుతున్నాయి.

ఇంధన కొరతపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పౌరసరఫరాల శాఖ వెంటనే స్పందించి సరఫరాను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News