రామన్నపేట: మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఇంధన సమస్య సోమవారం నాటికి మరింత ఉధృతమైంది. కంపెనీల నుంచి సరఫరా తగ్గిపోవడంతో మండలంలోని పలు పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించాయి.
ఇంధనం అందుబాటులో లేకపోవడంతో కొన్ని బంకులు పూర్తిగా మూతపడగా, స్టాక్ ఉన్న బంకుల వద్ద మాత్రం వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పనులు వదిలి ఇంధనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పనులు కూడా ఆలస్యమవుతున్నాయి.
ఇంధన కొరతపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పౌరసరఫరాల శాఖ వెంటనే స్పందించి సరఫరాను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి