Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:13 AM

పెట్రోల్ బంక్ నిర్లక్ష్యం.. ప్రయాణికుడికి తీవ్ర గాయాలు

పెట్రోల్ బంక్ నిర్లక్ష్యం.. ప్రయాణికుడికి తీవ్ర గాయాలు

పెట్రోల్ బంక్ నిర్లక్ష్యం.. ప్రయాణికుడికి తీవ్ర గాయాలు
27-04-2026 307 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోడ్డుకు అడ్డంగా కట్టిన వైర్ మెడకు తగిలిన ఘటన

: పెట్రోల్ బంక్ యజమాని నిర్లక్ష్యంతో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… దమ్మాయిగూడెం నుంచి బచ్చోడు వైపు వెళ్తున్న నందిపాటి ఉపేందర్, బీరోలు వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ముందు ప్రమాదానికి గురయ్యాడు.

పెట్రోల్ లేదని చెప్పుతూ బంక్ యజమాని రోడ్డుకు అడ్డంగా వైర్ కట్టివేయడంతో అది గమనించలేకపోయిన ఉపేందర్ మెడకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెప్పపాటులో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ఘటన పూర్తిగా బంక్ యజమాని నిర్లక్ష్యం వల్లే జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా రోడ్డుకు అడ్డంగా వైర్ కట్టడం తీవ్రమైన నిర్లక్ష్యమని పేర్కొన్నారు.

ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు, సంబంధిత పెట్రోల్ బంక్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం చేయడంతో పాటు అవసరమైతే బంకును సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Sthanikam

పెట్రోల్ బంక్ నిర్లక్ష్యం.. ప్రయాణికుడికి తీవ్ర గాయాలు

Article Image

రోడ్డుకు అడ్డంగా కట్టిన వైర్ మెడకు తగిలిన ఘటన

: పెట్రోల్ బంక్ యజమాని నిర్లక్ష్యంతో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… దమ్మాయిగూడెం నుంచి బచ్చోడు వైపు వెళ్తున్న నందిపాటి ఉపేందర్, బీరోలు వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ముందు ప్రమాదానికి గురయ్యాడు.

పెట్రోల్ లేదని చెప్పుతూ బంక్ యజమాని రోడ్డుకు అడ్డంగా వైర్ కట్టివేయడంతో అది గమనించలేకపోయిన ఉపేందర్ మెడకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెప్పపాటులో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ఘటన పూర్తిగా బంక్ యజమాని నిర్లక్ష్యం వల్లే జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా రోడ్డుకు అడ్డంగా వైర్ కట్టడం తీవ్రమైన నిర్లక్ష్యమని పేర్కొన్నారు.

ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు, సంబంధిత పెట్రోల్ బంక్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం చేయడంతో పాటు అవసరమైతే బంకును సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News