పెట్రోల్ బంక్ నిర్లక్ష్యం.. ప్రయాణికుడికి తీవ్ర గాయాలు
పెట్రోల్ బంక్ నిర్లక్ష్యం.. ప్రయాణికుడికి తీవ్ర గాయాలు
Editor Desk
రోడ్డుకు అడ్డంగా కట్టిన వైర్ మెడకు తగిలిన ఘటన
: పెట్రోల్ బంక్ యజమాని నిర్లక్ష్యంతో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… దమ్మాయిగూడెం నుంచి బచ్చోడు వైపు వెళ్తున్న నందిపాటి ఉపేందర్, బీరోలు వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ముందు ప్రమాదానికి గురయ్యాడు.
పెట్రోల్ లేదని చెప్పుతూ బంక్ యజమాని రోడ్డుకు అడ్డంగా వైర్ కట్టివేయడంతో అది గమనించలేకపోయిన ఉపేందర్ మెడకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెప్పపాటులో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటన పూర్తిగా బంక్ యజమాని నిర్లక్ష్యం వల్లే జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా రోడ్డుకు అడ్డంగా వైర్ కట్టడం తీవ్రమైన నిర్లక్ష్యమని పేర్కొన్నారు.
ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు, సంబంధిత పెట్రోల్ బంక్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం చేయడంతో పాటు అవసరమైతే బంకును సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి