శ్రీ సత్య సాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు జిల్లాస్థాయి బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై చర్చలు జరిపి, పంచాయతీ బూత్ కన్వీనర్లకు విస్తృత అవగాహన కల్పించారు.
మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్, రాష్ట్ర బూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొని బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి జిల్లా, నియోజకవర్గ, మండల మరియు పంచాయతీ స్థాయి బూత్ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి