PRINT TIME: April 09, 2026 04:01 PM
పెనుకొండలో గర్భిణీలకు పౌష్టికాహారం – మంత్రి సవిత సేవలు ప్రశంసనీయం
పెనుకొండలో గర్భిణీలకు పౌష్టికాహారం – మంత్రి సవిత సేవలు ప్రశంసనీయం
April 09, 2026 02:26 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
Somandepalli
Prakash
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని పెనుకొండ మండలం గుట్టూరు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం విచ్చేసే గర్భిణీ స్త్రీలకు గత 3 సంవత్సరాలు 8 నెలలుగా నిరంతరం పౌష్టికాహారం మరియు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని స్థానికులు కొనియాడుతున్నారు.
ఈ సేవా కార్యక్రమాన్ని SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత గారు కొనసాగిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీల ఆరోగ్యం దృష్ట్యా వారికి అవసరమైన పౌష్టికాహారం అందించడం ద్వారా తల్లి-శిశు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత అవసరమని, మంత్రి సవిత ఈ సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి