Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తిలో రైతులకు CRIDA శాస్త్రవేత్తల అవగాహన 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 04:30 PM

పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రంలో బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ

పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రంలో బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ

పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రంలో బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ
April 15, 2026 01:22 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్‌.హెచ్‌.44 క్రాస్ – కదిరి మార్గంలో బస్టాండ్ నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎస్‌.ఆర్‌.ఆర్‌. చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో, రాష్ట్ర చేనేత & జౌళి శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.

పాలసముద్రం, వడిగేపల్లి, రెడ్డిచెరువురుపల్లి గ్రామాల తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉదయం 9.30 గంటలకు నిర్వహించిన ఈ భూమిపూజ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

బస్టాండ్ నిర్మాణంతో ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పాలసముద్రం సహకార బ్యాంకు అధ్యక్షులు చంద్ర, సాగునీటి సంఘం అధ్యక్షులు హరనాథ్ రెడ్డి, నిడిమామిడప్ప, మనోహర్, కె.జయచంద్ర రెడ్డి, కె.మూర్తి, సంజీవప్ప, సుబాన్, పుర్రోళ్ళ ఆదినారాయణ, రామలింగారెడ్డి, హరీష్, ఇర్షాద్, రాజు రెడ్డి, చంద్రశేఖర్, చంద్రనాయక్, సాలెప్ప, రామంజినప్ప, వెంకటరమణ, నాగరాజు, ఆంజనేయులు (ఫీల్డ్ అసిస్టెంట్), గంగిరెడ్డి, కాటేపల్లి అంజి, రాగిమేకులపల్లి నాగరాజు, నరసింహప్ప, శ్రీరాములు, అదిశేషు, కాటేపల్లి అశ్వర్థ, నారాయణప్ప, లింగప్ప, మల్లి, క్రాస్ మల్లి, బావక్కగారి మూర్తి, యు.గంగాధర్, పరమేశ్ నాయక్, రామస్వామి నాయక్, కోగిరి శ్రీనివాసులు, శ్రీరామప్ప, తిప్పన్న, గంగరాజు, లక్ష్మీనారాయణ, షామీర్, అనిల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News