పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రంలో బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ
పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రంలో బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ
Prakash
సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్.హెచ్.44 క్రాస్ – కదిరి మార్గంలో బస్టాండ్ నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో, రాష్ట్ర చేనేత & జౌళి శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
పాలసముద్రం, వడిగేపల్లి, రెడ్డిచెరువురుపల్లి గ్రామాల తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉదయం 9.30 గంటలకు నిర్వహించిన ఈ భూమిపూజ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బస్టాండ్ నిర్మాణంతో ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాలసముద్రం సహకార బ్యాంకు అధ్యక్షులు చంద్ర, సాగునీటి సంఘం అధ్యక్షులు హరనాథ్ రెడ్డి, నిడిమామిడప్ప, మనోహర్, కె.జయచంద్ర రెడ్డి, కె.మూర్తి, సంజీవప్ప, సుబాన్, పుర్రోళ్ళ ఆదినారాయణ, రామలింగారెడ్డి, హరీష్, ఇర్షాద్, రాజు రెడ్డి, చంద్రశేఖర్, చంద్రనాయక్, సాలెప్ప, రామంజినప్ప, వెంకటరమణ, నాగరాజు, ఆంజనేయులు (ఫీల్డ్ అసిస్టెంట్), గంగిరెడ్డి, కాటేపల్లి అంజి, రాగిమేకులపల్లి నాగరాజు, నరసింహప్ప, శ్రీరాములు, అదిశేషు, కాటేపల్లి అశ్వర్థ, నారాయణప్ప, లింగప్ప, మల్లి, క్రాస్ మల్లి, బావక్కగారి మూర్తి, యు.గంగాధర్, పరమేశ్ నాయక్, రామస్వామి నాయక్, కోగిరి శ్రీనివాసులు, శ్రీరామప్ప, తిప్పన్న, గంగరాజు, లక్ష్మీనారాయణ, షామీర్, అనిల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి