Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:32 AM

పెనుకొండ మండలం క్రీడాకారులకు రన్నర్స్‌ అప్ విజయం

పెనుకొండ మండలం క్రీడాకారులకు రన్నర్స్‌ అప్ విజయం

పెనుకొండ మండలం క్రీడాకారులకు రన్నర్స్‌ అప్ విజయం
22-04-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

పెనుకొండ,: భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్లు తిరుపతిలోని జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ మండలం జట్టు రన్నర్స్‌ అప్‌గా నిలిచి ప్రతిభ చాటుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ హాజరయ్యారు. టిటిడి పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంత కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు పాల్గొన్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కే. గోపీనాథ్ (ఆస్ట్రేలియా), పెనుకొండ ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు వంశీకృష్ణ, ధనుంజయ నాగరాజు తదితరులు హాజరై క్రీడాకారులను అభినందించారు.

పెనుకొండ మండలం వాలీబాల్ జట్టులో హరి, అశోక్, సారయ్, మౌళి, సాయి, శివ, వెంకటేష్, తేజ, సురేష్, కృష్ణారెడ్డి, రమేష్ సభ్యులుగా పాల్గొని జట్టుకు విజయాన్ని అందించారు.

ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ భారతీయ జనతా పార్టీ, పెనుకొండ మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

పెనుకొండ మండలం క్రీడాకారులకు రన్నర్స్‌ అప్ విజయం

Article Image

పెనుకొండ,: భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్లు తిరుపతిలోని జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ మండలం జట్టు రన్నర్స్‌ అప్‌గా నిలిచి ప్రతిభ చాటుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ హాజరయ్యారు. టిటిడి పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంత కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు పాల్గొన్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కే. గోపీనాథ్ (ఆస్ట్రేలియా), పెనుకొండ ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు వంశీకృష్ణ, ధనుంజయ నాగరాజు తదితరులు హాజరై క్రీడాకారులను అభినందించారు.

పెనుకొండ మండలం వాలీబాల్ జట్టులో హరి, అశోక్, సారయ్, మౌళి, సాయి, శివ, వెంకటేష్, తేజ, సురేష్, కృష్ణారెడ్డి, రమేష్ సభ్యులుగా పాల్గొని జట్టుకు విజయాన్ని అందించారు.

ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ భారతీయ జనతా పార్టీ, పెనుకొండ మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News