పెనుకొండ మండలం క్రీడాకారులకు రన్నర్స్ అప్ విజయం
పెనుకొండ మండలం క్రీడాకారులకు రన్నర్స్ అప్ విజయం
Prakash
పెనుకొండ,: భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్లు తిరుపతిలోని జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ మండలం జట్టు రన్నర్స్ అప్గా నిలిచి ప్రతిభ చాటుకుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ హాజరయ్యారు. టిటిడి పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంత కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు పాల్గొన్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కే. గోపీనాథ్ (ఆస్ట్రేలియా), పెనుకొండ ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు వంశీకృష్ణ, ధనుంజయ నాగరాజు తదితరులు హాజరై క్రీడాకారులను అభినందించారు.
పెనుకొండ మండలం వాలీబాల్ జట్టులో హరి, అశోక్, సారయ్, మౌళి, సాయి, శివ, వెంకటేష్, తేజ, సురేష్, కృష్ణారెడ్డి, రమేష్ సభ్యులుగా పాల్గొని జట్టుకు విజయాన్ని అందించారు.
ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ భారతీయ జనతా పార్టీ, పెనుకొండ మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి