PRINT TIME: April 10, 2026 09:21 PM
పెళ్లిరోజు సందర్భంగా గోశాలకు పండ్ల విరాళం
పెళ్లిరోజు సందర్భంగా గోశాలకు పండ్ల విరాళం
April 10, 2026 07:23 PM
13 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట:
పెళ్లిరోజును సాంప్రదాయబద్ధంగా సేవా కార్యక్రమంగా జరుపుకుంటూ, గోశాలకు పండ్లు అందజేసిన ఘటన రామన్నపేట మండలంలో చోటుచేసుకుంది.
మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య గోశాలలో మండల కృష్ణ, సంధ్యారాణి దంపతులు తమ పెళ్లిరోజు సందర్భంగా గోమాతలకు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు నరసింహ స్వామి అఘోర గోవులకు పండ్లు పంపిణీ చేసి ఆహారంగా అందించారు.
ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు మాట్లాడుతూ… దాతలు ముందుకు వచ్చి గోశాలకు సహకరించడం శుభప్రదమని, గోమాత ఆశీస్సులు వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమం గ్రామంలో భక్తి, సేవా భావాలను ప్రతిబింబించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి