Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:04 PM

పేదరికం అడ్డంకి కాదు...విద్యార్థినికి అండగా సంఘమిత్ర సేవా సమితి

పేదరికం అడ్డంకి కాదు...విద్యార్థినికి అండగా సంఘమిత్ర సేవా సమితి

పేదరికం అడ్డంకి కాదు...విద్యార్థినికి అండగా సంఘమిత్ర సేవా సమితి
April 10, 2026 07:31 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బి.అక్షయకు సంఘమిత్ర సేవా సమితి ఆదర్శప్రాయంగా ముందుకు వచ్చి ఫీజు సహాయం అందించింది.ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న ఈ విద్యార్థిని చదువు మధ్యలోనే ఆగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో 8వ వార్డు కౌన్సిలర్,సంఘమిత్ర సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల సంపత్ తనవంతు సహాయంగా ఫీజును పూర్తిగా చెల్లించారు.సమాజంలో పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది.విద్య అనేది ప్రతి ఒక్కరికీ హక్కు అని,ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డంకి కాకూడదని సంపత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ సహాయం పట్ల విద్యార్థిని నానమ్మ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ,తమ కుటుంబానికి ఇది ఎంతో పెద్ద ఊరటనిచ్చిందని భావోద్వేగంగా చెప్పారు.అలాగే విద్యార్థిని చదువులో ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న ప్రగతి స్కూల్ యాజమాన్యానికి సంపత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కంతుల శంకర్,పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్డేమాన్ నరేందర్, బింగి భాను,కటకం నవీన్,సుంకరి సృజన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News