Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:21 PM

పేదరికం అడ్డంకి కాదు...విద్యార్థినికి అండగా సంఘమిత్ర సేవా సమితి

పేదరికం అడ్డంకి కాదు...విద్యార్థినికి అండగా సంఘమిత్ర సేవా సమితి

పేదరికం అడ్డంకి కాదు...విద్యార్థినికి అండగా సంఘమిత్ర సేవా సమితి
April 10, 2026 07:31 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బి.అక్షయకు సంఘమిత్ర సేవా సమితి ఆదర్శప్రాయంగా ముందుకు వచ్చి ఫీజు సహాయం అందించింది.ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న ఈ విద్యార్థిని చదువు మధ్యలోనే ఆగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో 8వ వార్డు కౌన్సిలర్,సంఘమిత్ర సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల సంపత్ తనవంతు సహాయంగా ఫీజును పూర్తిగా చెల్లించారు.సమాజంలో పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది.విద్య అనేది ప్రతి ఒక్కరికీ హక్కు అని,ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డంకి కాకూడదని సంపత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ సహాయం పట్ల విద్యార్థిని నానమ్మ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ,తమ కుటుంబానికి ఇది ఎంతో పెద్ద ఊరటనిచ్చిందని భావోద్వేగంగా చెప్పారు.అలాగే విద్యార్థిని చదువులో ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న ప్రగతి స్కూల్ యాజమాన్యానికి సంపత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కంతుల శంకర్,పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్డేమాన్ నరేందర్, బింగి భాను,కటకం నవీన్,సుంకరి సృజన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News