Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు బూదిలి హైస్కూల్ అభివృద్ధి పనులకు భూమి పూజ – జలధార కార్యక్రమం ప్రారంభం 5k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 26, 2026 04:11 PM

పేదలందరికీ సొంత ఇల్లే ప్రభుత్వ లక్ష్యం

పేదలందరికీ సొంత ఇల్లే ప్రభుత్వ లక్ష్యం

పేదలందరికీ సొంత ఇల్లే ప్రభుత్వ లక్ష్యం
April 26, 2026 02:43 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో పున్న యాదమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ఆమె ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.​ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. గూడు లేని పేదలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తిస్తుందని అన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోర్పునూరి నరసింహ గౌడ్, తోర్పునూరి రమేష్ (రవి గౌడ్), యువజన కాంగ్రెస్ నాయకులు చింతకింది గణేష్ గౌడ్, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News