పేదలందరికీ సొంత ఇల్లే ప్రభుత్వ లక్ష్యం
పేదలందరికీ సొంత ఇల్లే ప్రభుత్వ లక్ష్యం
K.RAVI
చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో పున్న యాదమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ఆమె ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. గూడు లేని పేదలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తిస్తుందని అన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోర్పునూరి నరసింహ గౌడ్, తోర్పునూరి రమేష్ (రవి గౌడ్), యువజన కాంగ్రెస్ నాయకులు చింతకింది గణేష్ గౌడ్, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి