Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:53 PM

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
09-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

గురువారం భువనగిరి పట్టణంలోని హనుమాన్‌వాడలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులు, బోధన విధానం, ఉపాధ్యాయుల హాజరు, తరగతి గదులు, డార్మిటరీ హాల్ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.

విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని తెలుసుకున్నారు. భోజనశాలను తనిఖీ చేసి ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వంట సామగ్రి, బియ్యం తదితర సరుకుల నాణ్యతను పరిశీలించి గడువు తేదీలను తప్పనిసరిగా సరిచూడాలని ఆదేశించారు.

అలాగే పాఠశాల పరిసరాలు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై అవగాహన పెంచేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచిస్తూ, కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

భువనగిరి: పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

గురువారం భువనగిరి పట్టణంలోని హనుమాన్‌వాడలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులు, బోధన విధానం, ఉపాధ్యాయుల హాజరు, తరగతి గదులు, డార్మిటరీ హాల్ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.

విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని తెలుసుకున్నారు. భోజనశాలను తనిఖీ చేసి ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వంట సామగ్రి, బియ్యం తదితర సరుకుల నాణ్యతను పరిశీలించి గడువు తేదీలను తప్పనిసరిగా సరిచూడాలని ఆదేశించారు.

అలాగే పాఠశాల పరిసరాలు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై అవగాహన పెంచేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచిస్తూ, కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News