పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
Editor Desk
భువనగిరి: పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.
గురువారం భువనగిరి పట్టణంలోని హనుమాన్వాడలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులు, బోధన విధానం, ఉపాధ్యాయుల హాజరు, తరగతి గదులు, డార్మిటరీ హాల్ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని తెలుసుకున్నారు. భోజనశాలను తనిఖీ చేసి ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వంట సామగ్రి, బియ్యం తదితర సరుకుల నాణ్యతను పరిశీలించి గడువు తేదీలను తప్పనిసరిగా సరిచూడాలని ఆదేశించారు.
అలాగే పాఠశాల పరిసరాలు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై అవగాహన పెంచేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచిస్తూ, కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి