Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 07:06 PM

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
April 09, 2026 05:19 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

గురువారం భువనగిరి పట్టణంలోని హనుమాన్‌వాడలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులు, బోధన విధానం, ఉపాధ్యాయుల హాజరు, తరగతి గదులు, డార్మిటరీ హాల్ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.

విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని తెలుసుకున్నారు. భోజనశాలను తనిఖీ చేసి ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వంట సామగ్రి, బియ్యం తదితర సరుకుల నాణ్యతను పరిశీలించి గడువు తేదీలను తప్పనిసరిగా సరిచూడాలని ఆదేశించారు.

అలాగే పాఠశాల పరిసరాలు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై అవగాహన పెంచేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచిస్తూ, కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News