Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:18 AM

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
April 09, 2026 05:19 PM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

గురువారం భువనగిరి పట్టణంలోని హనుమాన్‌వాడలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులు, బోధన విధానం, ఉపాధ్యాయుల హాజరు, తరగతి గదులు, డార్మిటరీ హాల్ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.

విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని తెలుసుకున్నారు. భోజనశాలను తనిఖీ చేసి ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వంట సామగ్రి, బియ్యం తదితర సరుకుల నాణ్యతను పరిశీలించి గడువు తేదీలను తప్పనిసరిగా సరిచూడాలని ఆదేశించారు.

అలాగే పాఠశాల పరిసరాలు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై అవగాహన పెంచేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచిస్తూ, కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News