Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు పాల్గొని సహకరించాలి:చింత గోపాల్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 09:59 PM

పాఠశాలల భద్రతపై సమన్వయ సమావేశం

పాఠశాలల భద్రతపై సమన్వయ సమావేశం

పాఠశాలల భద్రతపై సమన్వయ సమావేశం
April 27, 2026 02:46 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి, ఏప్రిల్ 27 (స్థానికం న్యూస్) సోమందేపల్లి మండలంలో పాఠశాలల భద్రత మరియు ఆస్తుల పరిరక్షణపై ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దారు, ఎంపీడీవో, ఎంఈఓ, సోమందేపల్లి ఎస్‌.ఐతో పాటు మండలంలోని అన్ని పాఠశాలల హెడ్మాస్టర్లు, పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) చైర్మన్లు, సభ్యులు హాజరయ్యారు.

పాఠశాలల్లో ఉన్న విలువైన వస్తువులను భద్రంగా నిల్వ ఉంచాలని అధికారులు సూచించారు. భద్రతపై తహసీల్దారు, ఎంపీడీవో, ఎంఈఓ, ఎస్‌.ఐ, హెడ్మాస్టర్లు, SMC సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి బాధ్యత తీసుకోవాలని తెలిపారు.

ప్రతి పాఠశాలలో CCTV కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, సాధ్యం కాని చోట వాచ్‌మన్‌ను నియమించాలని నిర్ణయించారు. అన్ని హెడ్మాస్టర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, CCTV ఫుటేజ్‌ను ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. హైస్కూల్‌లలో ఉన్న CCTVలను పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా మానిటరింగ్ చేయాలని సూచించారు.

పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్న కొళాయిలు మరియు ఇతర విలువైన వస్తువులు దెబ్బతినకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట సోలార్ ఆధారిత CCTV కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణను పోలీస్ శాఖ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ చర్యలతో పాఠశాలల భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News