Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:31 AM

పాఠశాలల భద్రతపై సమన్వయ సమావేశం

పాఠశాలల భద్రతపై సమన్వయ సమావేశం

పాఠశాలల భద్రతపై సమన్వయ సమావేశం
27-04-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి, ఏప్రిల్ 27 (స్థానికం న్యూస్) సోమందేపల్లి మండలంలో పాఠశాలల భద్రత మరియు ఆస్తుల పరిరక్షణపై ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దారు, ఎంపీడీవో, ఎంఈఓ, సోమందేపల్లి ఎస్‌.ఐతో పాటు మండలంలోని అన్ని పాఠశాలల హెడ్మాస్టర్లు, పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) చైర్మన్లు, సభ్యులు హాజరయ్యారు.

పాఠశాలల్లో ఉన్న విలువైన వస్తువులను భద్రంగా నిల్వ ఉంచాలని అధికారులు సూచించారు. భద్రతపై తహసీల్దారు, ఎంపీడీవో, ఎంఈఓ, ఎస్‌.ఐ, హెడ్మాస్టర్లు, SMC సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి బాధ్యత తీసుకోవాలని తెలిపారు.

ప్రతి పాఠశాలలో CCTV కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, సాధ్యం కాని చోట వాచ్‌మన్‌ను నియమించాలని నిర్ణయించారు. అన్ని హెడ్మాస్టర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, CCTV ఫుటేజ్‌ను ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. హైస్కూల్‌లలో ఉన్న CCTVలను పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా మానిటరింగ్ చేయాలని సూచించారు.

పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్న కొళాయిలు మరియు ఇతర విలువైన వస్తువులు దెబ్బతినకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట సోలార్ ఆధారిత CCTV కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణను పోలీస్ శాఖ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ చర్యలతో పాఠశాలల భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

పాఠశాలల భద్రతపై సమన్వయ సమావేశం

Article Image

సోమందేపల్లి, ఏప్రిల్ 27 (స్థానికం న్యూస్) సోమందేపల్లి మండలంలో పాఠశాలల భద్రత మరియు ఆస్తుల పరిరక్షణపై ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దారు, ఎంపీడీవో, ఎంఈఓ, సోమందేపల్లి ఎస్‌.ఐతో పాటు మండలంలోని అన్ని పాఠశాలల హెడ్మాస్టర్లు, పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) చైర్మన్లు, సభ్యులు హాజరయ్యారు.

పాఠశాలల్లో ఉన్న విలువైన వస్తువులను భద్రంగా నిల్వ ఉంచాలని అధికారులు సూచించారు. భద్రతపై తహసీల్దారు, ఎంపీడీవో, ఎంఈఓ, ఎస్‌.ఐ, హెడ్మాస్టర్లు, SMC సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి బాధ్యత తీసుకోవాలని తెలిపారు.

ప్రతి పాఠశాలలో CCTV కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, సాధ్యం కాని చోట వాచ్‌మన్‌ను నియమించాలని నిర్ణయించారు. అన్ని హెడ్మాస్టర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, CCTV ఫుటేజ్‌ను ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. హైస్కూల్‌లలో ఉన్న CCTVలను పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా మానిటరింగ్ చేయాలని సూచించారు.

పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్న కొళాయిలు మరియు ఇతర విలువైన వస్తువులు దెబ్బతినకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట సోలార్ ఆధారిత CCTV కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణను పోలీస్ శాఖ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ చర్యలతో పాఠశాలల భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News