పాఠశాలల భద్రతపై సమన్వయ సమావేశం
పాఠశాలల భద్రతపై సమన్వయ సమావేశం
Prakash
సోమందేపల్లి, ఏప్రిల్ 27 (స్థానికం న్యూస్) సోమందేపల్లి మండలంలో పాఠశాలల భద్రత మరియు ఆస్తుల పరిరక్షణపై ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దారు, ఎంపీడీవో, ఎంఈఓ, సోమందేపల్లి ఎస్.ఐతో పాటు మండలంలోని అన్ని పాఠశాలల హెడ్మాస్టర్లు, పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) చైర్మన్లు, సభ్యులు హాజరయ్యారు.
పాఠశాలల్లో ఉన్న విలువైన వస్తువులను భద్రంగా నిల్వ ఉంచాలని అధికారులు సూచించారు. భద్రతపై తహసీల్దారు, ఎంపీడీవో, ఎంఈఓ, ఎస్.ఐ, హెడ్మాస్టర్లు, SMC సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి బాధ్యత తీసుకోవాలని తెలిపారు.
ప్రతి పాఠశాలలో CCTV కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, సాధ్యం కాని చోట వాచ్మన్ను నియమించాలని నిర్ణయించారు. అన్ని హెడ్మాస్టర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, CCTV ఫుటేజ్ను ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. హైస్కూల్లలో ఉన్న CCTVలను పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా మానిటరింగ్ చేయాలని సూచించారు.
పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్న కొళాయిలు మరియు ఇతర విలువైన వస్తువులు దెబ్బతినకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట సోలార్ ఆధారిత CCTV కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణను పోలీస్ శాఖ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ చర్యలతో పాఠశాలల భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి