పథకాలు అర్హులకు చేరాలి – ఎంపీడీఓ రాములు.
పథకాలు అర్హులకు చేరాలి – ఎంపీడీఓ రాములు.
Editor Desk
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ ఎ. రాములు పిలుపునిచ్చారు. అర్హులకు పథకాలు చేరేలా చూడటం అధికారుల ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రామన్నపేట గ్రామపంచాయతీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం ఎంపీడీఓ రాములు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాపన్న సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉప సర్పంచ్ మోటర్ రమేష్, విద్యుత్ ఏఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి