Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:11 AM

పథకాలు అర్హులకు చేరాలి – ఎంపీడీఓ రాములు.

పథకాలు అర్హులకు చేరాలి – ఎంపీడీఓ రాములు.

పథకాలు అర్హులకు చేరాలి – ఎంపీడీఓ రాములు.
April 02, 2026 05:12 PM 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ ఎ. రాములు పిలుపునిచ్చారు. అర్హులకు పథకాలు చేరేలా చూడటం అధికారుల ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రామన్నపేట గ్రామపంచాయతీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

అనంతరం ఎంపీడీఓ రాములు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాపన్న సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉప సర్పంచ్ మోటర్ రమేష్, విద్యుత్ ఏఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News