Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:07 AM

ప్రొటోకాల్‌కు పంగనామం.. NDCMS మేనేజర్‌పై కార్పొరేటర్ల ఆగ్రహం

ప్రొటోకాల్‌కు పంగనామం.. NDCMS మేనేజర్‌పై కార్పొరేటర్ల ఆగ్రహం

ప్రొటోకాల్‌కు పంగనామం.. NDCMS మేనేజర్‌పై కార్పొరేటర్ల ఆగ్రహం
April 06, 2026 08:09 PM 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రొటోకాల్ పాటించలేదంటూ NDCMS బిజినెస్ మేనేజర్ నాగిళ్ల మురళిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులను పూర్తిగా పక్కనబెట్టి వ్యవహరించడంపై కార్పొరేటర్లు మండిపడుతున్నారు.

జిల్లా కేంద్రంలోని బత్తాయి మార్కెట్‌లో, అలాగే డాన్ బోస్కో కాలేజీ వెనుక ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సంబంధించి 9వ డివిజన్ కార్పొరేటర్ బాణావత్ దీప్లా నాయక్‌కు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికైన ప్రజా ప్రతినిధిని పట్టించుకోకుండా, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు సమాచారం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

ఇక, అధికార పార్టీ నేతల సూచనల మేరకే మేనేజర్ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ చేసినా స్పందన లేకపోవడం, గౌరవం ఇవ్వకపోవడం పట్ల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పని చేయించుకుని తొలగింపు.. యువకుల ఆవేదన

బత్తాయి మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రంలో స్థానిక యువకులను పనికి తీసుకుని, పదిరోజుల తరువాత అకస్మాత్తుగా తొలగించడం మరో వివాదానికి దారి తీసింది. అవసరం లేకపోతే ఎందుకు పని చేయించుకున్నారని యువకులు ప్రశ్నిస్తున్నారు. మేనేజర్‌ను ప్రశ్నిస్తే, “స్థానిక కాంగ్రెస్ నాయకులను అడగండి” అని సమాధానం ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News