Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:14 PM

ప్రొటోకాల్‌కు పంగనామం.. NDCMS మేనేజర్‌పై కార్పొరేటర్ల ఆగ్రహం

ప్రొటోకాల్‌కు పంగనామం.. NDCMS మేనేజర్‌పై కార్పొరేటర్ల ఆగ్రహం

ప్రొటోకాల్‌కు పంగనామం.. NDCMS మేనేజర్‌పై కార్పొరేటర్ల ఆగ్రహం
06-04-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రొటోకాల్ పాటించలేదంటూ NDCMS బిజినెస్ మేనేజర్ నాగిళ్ల మురళిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులను పూర్తిగా పక్కనబెట్టి వ్యవహరించడంపై కార్పొరేటర్లు మండిపడుతున్నారు.

జిల్లా కేంద్రంలోని బత్తాయి మార్కెట్‌లో, అలాగే డాన్ బోస్కో కాలేజీ వెనుక ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సంబంధించి 9వ డివిజన్ కార్పొరేటర్ బాణావత్ దీప్లా నాయక్‌కు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికైన ప్రజా ప్రతినిధిని పట్టించుకోకుండా, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు సమాచారం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

ఇక, అధికార పార్టీ నేతల సూచనల మేరకే మేనేజర్ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ చేసినా స్పందన లేకపోవడం, గౌరవం ఇవ్వకపోవడం పట్ల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పని చేయించుకుని తొలగింపు.. యువకుల ఆవేదన

బత్తాయి మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రంలో స్థానిక యువకులను పనికి తీసుకుని, పదిరోజుల తరువాత అకస్మాత్తుగా తొలగించడం మరో వివాదానికి దారి తీసింది. అవసరం లేకపోతే ఎందుకు పని చేయించుకున్నారని యువకులు ప్రశ్నిస్తున్నారు. మేనేజర్‌ను ప్రశ్నిస్తే, “స్థానిక కాంగ్రెస్ నాయకులను అడగండి” అని సమాధానం ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Sthanikam

ప్రొటోకాల్‌కు పంగనామం.. NDCMS మేనేజర్‌పై కార్పొరేటర్ల ఆగ్రహం

Article Image

నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రొటోకాల్ పాటించలేదంటూ NDCMS బిజినెస్ మేనేజర్ నాగిళ్ల మురళిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులను పూర్తిగా పక్కనబెట్టి వ్యవహరించడంపై కార్పొరేటర్లు మండిపడుతున్నారు.

జిల్లా కేంద్రంలోని బత్తాయి మార్కెట్‌లో, అలాగే డాన్ బోస్కో కాలేజీ వెనుక ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సంబంధించి 9వ డివిజన్ కార్పొరేటర్ బాణావత్ దీప్లా నాయక్‌కు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికైన ప్రజా ప్రతినిధిని పట్టించుకోకుండా, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు సమాచారం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

ఇక, అధికార పార్టీ నేతల సూచనల మేరకే మేనేజర్ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ చేసినా స్పందన లేకపోవడం, గౌరవం ఇవ్వకపోవడం పట్ల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పని చేయించుకుని తొలగింపు.. యువకుల ఆవేదన

బత్తాయి మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రంలో స్థానిక యువకులను పనికి తీసుకుని, పదిరోజుల తరువాత అకస్మాత్తుగా తొలగించడం మరో వివాదానికి దారి తీసింది. అవసరం లేకపోతే ఎందుకు పని చేయించుకున్నారని యువకులు ప్రశ్నిస్తున్నారు. మేనేజర్‌ను ప్రశ్నిస్తే, “స్థానిక కాంగ్రెస్ నాయకులను అడగండి” అని సమాధానం ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News