Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆహార నాణ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్ గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 10:23 PM

ప్రొటోకాల్‌కు పంగనామం.. NDCMS మేనేజర్‌పై కార్పొరేటర్ల ఆగ్రహం

ప్రొటోకాల్‌కు పంగనామం.. NDCMS మేనేజర్‌పై కార్పొరేటర్ల ఆగ్రహం

ప్రొటోకాల్‌కు పంగనామం.. NDCMS మేనేజర్‌పై కార్పొరేటర్ల ఆగ్రహం
April 06, 2026 08:09 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రొటోకాల్ పాటించలేదంటూ NDCMS బిజినెస్ మేనేజర్ నాగిళ్ల మురళిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులను పూర్తిగా పక్కనబెట్టి వ్యవహరించడంపై కార్పొరేటర్లు మండిపడుతున్నారు.

జిల్లా కేంద్రంలోని బత్తాయి మార్కెట్‌లో, అలాగే డాన్ బోస్కో కాలేజీ వెనుక ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సంబంధించి 9వ డివిజన్ కార్పొరేటర్ బాణావత్ దీప్లా నాయక్‌కు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికైన ప్రజా ప్రతినిధిని పట్టించుకోకుండా, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు సమాచారం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

ఇక, అధికార పార్టీ నేతల సూచనల మేరకే మేనేజర్ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ చేసినా స్పందన లేకపోవడం, గౌరవం ఇవ్వకపోవడం పట్ల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పని చేయించుకుని తొలగింపు.. యువకుల ఆవేదన

బత్తాయి మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రంలో స్థానిక యువకులను పనికి తీసుకుని, పదిరోజుల తరువాత అకస్మాత్తుగా తొలగించడం మరో వివాదానికి దారి తీసింది. అవసరం లేకపోతే ఎందుకు పని చేయించుకున్నారని యువకులు ప్రశ్నిస్తున్నారు. మేనేజర్‌ను ప్రశ్నిస్తే, “స్థానిక కాంగ్రెస్ నాయకులను అడగండి” అని సమాధానం ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News