ప్రొటోకాల్కు పంగనామం.. NDCMS మేనేజర్పై కార్పొరేటర్ల ఆగ్రహం
ప్రొటోకాల్కు పంగనామం.. NDCMS మేనేజర్పై కార్పొరేటర్ల ఆగ్రహం
Editor Desk
నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రొటోకాల్ పాటించలేదంటూ NDCMS బిజినెస్ మేనేజర్ నాగిళ్ల మురళిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులను పూర్తిగా పక్కనబెట్టి వ్యవహరించడంపై కార్పొరేటర్లు మండిపడుతున్నారు.
జిల్లా కేంద్రంలోని బత్తాయి మార్కెట్లో, అలాగే డాన్ బోస్కో కాలేజీ వెనుక ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సంబంధించి 9వ డివిజన్ కార్పొరేటర్ బాణావత్ దీప్లా నాయక్కు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికైన ప్రజా ప్రతినిధిని పట్టించుకోకుండా, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు సమాచారం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.
ఇక, అధికార పార్టీ నేతల సూచనల మేరకే మేనేజర్ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ చేసినా స్పందన లేకపోవడం, గౌరవం ఇవ్వకపోవడం పట్ల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పని చేయించుకుని తొలగింపు.. యువకుల ఆవేదన
బత్తాయి మార్కెట్లోని కొనుగోలు కేంద్రంలో స్థానిక యువకులను పనికి తీసుకుని, పదిరోజుల తరువాత అకస్మాత్తుగా తొలగించడం మరో వివాదానికి దారి తీసింది. అవసరం లేకపోతే ఎందుకు పని చేయించుకున్నారని యువకులు ప్రశ్నిస్తున్నారు. మేనేజర్ను ప్రశ్నిస్తే, “స్థానిక కాంగ్రెస్ నాయకులను అడగండి” అని సమాధానం ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి