యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం పారిశుద్ధ కార్మికులకు సన్మానం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ కార్మికులను సర్పంచ్ కంచి మధుసూదన్ ఘనంగా అభినందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ స్వచ్ఛతలో పారిశుద్ధ కార్మికుల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. వారి కృషిని గుర్తిస్తూ శాలువాలు కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి