ప్రిన్సిపాల్ ఎస్. రాజా ఎక్కడ? కలెక్టర్లు మారినా… నిర్లక్ష్యం యథాతథం!
ప్రిన్సిపాల్ ఎస్. రాజా ఎక్కడ? కలెక్టర్లు మారినా… నిర్లక్ష్యం యథాతథం!
Editor Desk
రామన్నపేట: అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆకస్మిక తనిఖీల్లో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. విధుల్లో ఉండాల్సిన ప్రిన్సిపాల్ గైర్హాజరు కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.
పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, హాస్టల్లో ఉన్న లోపాలను వెంటనే గుర్తించి పూర్తి నివేదిక సమర్పించాలని వార్డెన్ను ఆదేశించారు. అనంతరం జనంపల్లి బాలికల రెసిడెన్షియల్ కళాశాలకు వెళ్లగా, ప్రిన్సిపాల్ ఎస్. రాజా హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం సహించబోమని హెచ్చరించిన ఆయన, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, వేసవిలో తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ఉపాధి హామీ చెల్లింపులపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి