పరీక్షల పర్వానికి శ్రీకారం.. విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు
పరీక్షల పర్వానికి శ్రీకారం.. విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు
స్థానికం బృందం
రేపటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థిని, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి తన శ్రమకు తగిన ఫలితం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు ఎటువంటి ఆందోళన, ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. సమయాన్ని సక్రమంగా వినియోగించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు.
నూరు శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు గౌరవం తీసుకురావాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆశలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించామని కలెక్టర్ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి