పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు
పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు
Editor Desk
పట్టణంలోని 37వ వార్డులో పర్వతాపురం గ్రామానికి వెళ్లే రహదారి అభివృద్ధికి రూ.30 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గురువారం మున్సిపల్ కమిషనర్ నహిమ్ అహ్మద్ కూటమి నాయకులతో కలిసి భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ గత మూడేళ్లుగా ఈ రహదారి శిథిలావస్థకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే పీవీ పార్థసారధి ప్రత్యేక చొరవతో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా అంచనా వేయించి నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు.
పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, జనసేన పట్టణ అధ్యక్షుడు రేణు వర్మ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగార్జున, సీనియర్ నాయకులు లోకేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, సుబ్రహ్మణ్యం, వీరప్ప, జనసేన నాయకులు ఉరుకుందు శ్యామ్, మున్సిపల్ అధికారులు సత్యనారాయణ, రామ్మూర్తి, భువన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి