Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:52 PM

పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు

పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు

పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు
09-04-2026 196 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పట్టణంలోని 37వ వార్డులో పర్వతాపురం గ్రామానికి వెళ్లే రహదారి అభివృద్ధికి రూ.30 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గురువారం మున్సిపల్ కమిషనర్ నహిమ్ అహ్మద్ కూటమి నాయకులతో కలిసి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ గత మూడేళ్లుగా ఈ రహదారి శిథిలావస్థకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే పీవీ పార్థసారధి ప్రత్యేక చొరవతో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా అంచనా వేయించి నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు.

పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, జనసేన పట్టణ అధ్యక్షుడు రేణు వర్మ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగార్జున, సీనియర్ నాయకులు లోకేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, సుబ్రహ్మణ్యం, వీరప్ప, జనసేన నాయకులు ఉరుకుందు శ్యామ్, మున్సిపల్ అధికారులు సత్యనారాయణ, రామ్మూర్తి, భువన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు

Article Image

పట్టణంలోని 37వ వార్డులో పర్వతాపురం గ్రామానికి వెళ్లే రహదారి అభివృద్ధికి రూ.30 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గురువారం మున్సిపల్ కమిషనర్ నహిమ్ అహ్మద్ కూటమి నాయకులతో కలిసి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ గత మూడేళ్లుగా ఈ రహదారి శిథిలావస్థకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే పీవీ పార్థసారధి ప్రత్యేక చొరవతో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా అంచనా వేయించి నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు.

పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, జనసేన పట్టణ అధ్యక్షుడు రేణు వర్మ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగార్జున, సీనియర్ నాయకులు లోకేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, సుబ్రహ్మణ్యం, వీరప్ప, జనసేన నాయకులు ఉరుకుందు శ్యామ్, మున్సిపల్ అధికారులు సత్యనారాయణ, రామ్మూర్తి, భువన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News