ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం
Editor Desk
హైదరాబాద్,
ప్రభుత్వ సిటీ కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుక్ రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమాన్ని ఆచార్య కోయి కోటేశ్వరరావు ప్రారంభించగా, ముఖ్య అతిథులుగా డా. దుర్గాప్రసాద్, డా. విజయ్కుమార్, డా. నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో ఈ-లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ వంటి ఆధునిక పద్ధతులను అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థులు పాఠ్యేతర పుస్తకాలు, జీవిత చరిత్రలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
విద్యార్థులు తనుషా ‘అంబేద్కర్ కథలు’, మహేష్ ‘భగత్సింగ్ చరిత్ర’, అనిల్కుమార్ ‘అహల్యాబాయి హోల్కర్’ పుస్తకాలపై సమీక్షలు సమర్పించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించేలా సాగింది.
డా. రవికుమార్ చేగోని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి