Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతి గృహ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సబ్ కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 02:54 PM

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం

 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం
April 23, 2026 11:52 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

ప్రభుత్వ సిటీ కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుక్ రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమాన్ని ఆచార్య కోయి కోటేశ్వరరావు ప్రారంభించగా, ముఖ్య అతిథులుగా డా. దుర్గాప్రసాద్, డా. విజయ్‌కుమార్, డా. నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో ఈ-లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ వంటి ఆధునిక పద్ధతులను అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థులు పాఠ్యేతర పుస్తకాలు, జీవిత చరిత్రలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు.

విద్యార్థులు తనుషా ‘అంబేద్కర్ కథలు’, మహేష్ ‘భగత్‌సింగ్ చరిత్ర’, అనిల్‌కుమార్ ‘అహల్యాబాయి హోల్కర్’ పుస్తకాలపై సమీక్షలు సమర్పించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించేలా సాగింది.

డా. రవికుమార్ చేగోని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News