Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:11 PM

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం

 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం
23-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

ప్రభుత్వ సిటీ కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుక్ రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమాన్ని ఆచార్య కోయి కోటేశ్వరరావు ప్రారంభించగా, ముఖ్య అతిథులుగా డా. దుర్గాప్రసాద్, డా. విజయ్‌కుమార్, డా. నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో ఈ-లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ వంటి ఆధునిక పద్ధతులను అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థులు పాఠ్యేతర పుస్తకాలు, జీవిత చరిత్రలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు.

విద్యార్థులు తనుషా ‘అంబేద్కర్ కథలు’, మహేష్ ‘భగత్‌సింగ్ చరిత్ర’, అనిల్‌కుమార్ ‘అహల్యాబాయి హోల్కర్’ పుస్తకాలపై సమీక్షలు సమర్పించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించేలా సాగింది.

డా. రవికుమార్ చేగోని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం

Article Image

హైదరాబాద్,

ప్రభుత్వ సిటీ కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుక్ రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమాన్ని ఆచార్య కోయి కోటేశ్వరరావు ప్రారంభించగా, ముఖ్య అతిథులుగా డా. దుర్గాప్రసాద్, డా. విజయ్‌కుమార్, డా. నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో ఈ-లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ వంటి ఆధునిక పద్ధతులను అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థులు పాఠ్యేతర పుస్తకాలు, జీవిత చరిత్రలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు.

విద్యార్థులు తనుషా ‘అంబేద్కర్ కథలు’, మహేష్ ‘భగత్‌సింగ్ చరిత్ర’, అనిల్‌కుమార్ ‘అహల్యాబాయి హోల్కర్’ పుస్తకాలపై సమీక్షలు సమర్పించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించేలా సాగింది.

డా. రవికుమార్ చేగోని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News