Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 03:29 PM

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు
April 25, 2026 01:41 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా జనరల్ ఆసుపత్రిలో అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ. భాస్కరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. మనోహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఇళ్ల వద్ద పాత టైర్లు, కూలర్లు, ఖాళీ పాత్రలు, కొబ్బరి బోండాలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి శుక్రవారం నిర్వహించే ‘ఫ్రైడే–డ్రై డే’ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ ఎం. మనోహర్ మాట్లాడుతూ దోమ కాటు వల్ల మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉందన్నారు. ప్రపంచ విజేతగా నిలిచిన Alexander the Great కూడా దోమ కాటు కారణంగా మరణించినట్లు చరిత్ర చెబుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాండు నాయక్, ఆర్‌ఎంఓ డాక్టర్ కిరణ్ కుమార్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎన్. వంశీకృష్ణ, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ వీణ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ స్వరాజ్య లక్ష్మి, వైద్య అధికారి డాక్టర్ నిరోషా, సబ్ యూనిట్ అధికారులు, నర్సింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News