Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:10 AM

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు
25-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా జనరల్ ఆసుపత్రిలో అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ. భాస్కరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. మనోహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఇళ్ల వద్ద పాత టైర్లు, కూలర్లు, ఖాళీ పాత్రలు, కొబ్బరి బోండాలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి శుక్రవారం నిర్వహించే ‘ఫ్రైడే–డ్రై డే’ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ ఎం. మనోహర్ మాట్లాడుతూ దోమ కాటు వల్ల మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉందన్నారు. ప్రపంచ విజేతగా నిలిచిన Alexander the Great కూడా దోమ కాటు కారణంగా మరణించినట్లు చరిత్ర చెబుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాండు నాయక్, ఆర్‌ఎంఓ డాక్టర్ కిరణ్ కుమార్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎన్. వంశీకృష్ణ, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ వీణ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ స్వరాజ్య లక్ష్మి, వైద్య అధికారి డాక్టర్ నిరోషా, సబ్ యూనిట్ అధికారులు, నర్సింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

Article Image

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా జనరల్ ఆసుపత్రిలో అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ. భాస్కరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. మనోహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఇళ్ల వద్ద పాత టైర్లు, కూలర్లు, ఖాళీ పాత్రలు, కొబ్బరి బోండాలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి శుక్రవారం నిర్వహించే ‘ఫ్రైడే–డ్రై డే’ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ ఎం. మనోహర్ మాట్లాడుతూ దోమ కాటు వల్ల మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉందన్నారు. ప్రపంచ విజేతగా నిలిచిన Alexander the Great కూడా దోమ కాటు కారణంగా మరణించినట్లు చరిత్ర చెబుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాండు నాయక్, ఆర్‌ఎంఓ డాక్టర్ కిరణ్ కుమార్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎన్. వంశీకృష్ణ, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ వీణ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ స్వరాజ్య లక్ష్మి, వైద్య అధికారి డాక్టర్ నిరోషా, సబ్ యూనిట్ అధికారులు, నర్సింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News