Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:01 PM

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాక్‌థాన్. ప్రివెంటివ్ హెల్త్‌పై ప్రజల్లో అవగాహన

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాక్‌థాన్. ప్రివెంటివ్ హెల్త్‌పై ప్రజల్లో అవగాహన

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాక్‌థాన్.  ప్రివెంటివ్ హెల్త్‌పై ప్రజల్లో అవగాహన
April 11, 2026 12:51 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరగూడ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదరగూడ, ఉప్పర్పల్లి, అట్టాపూర్ ప్రాంతాల ప్రజలు కమ్యూనిటీ వాక్ నిర్వహించారు. “టుగెదర్ ఫర్ హెల్త్ – స్టాండ్ విత్ సైన్స్” అనే థీమ్‌తో పెద్ద తల్లకుంట పార్క్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానికులు నల్లింగ్ రమేష్, మొండ్రా కొమ్రయ్య, కే. హరినాథ్, సహదేవ రెడ్డి, బర్ల జంగయ్యతో పాటు గైనకాలజిస్టు డాక్టర్ రాణి కొప్పుల, ఇస్కాన్ అట్టాపూర్ ప్రతినిధి రాధాకాంత్ దాస్ పాల్గొన్నారు.

జీవనశైలి వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని వక్తలు పేర్కొన్నారు. ప్రజలే ముందుకు వచ్చి ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అహంసూత్ర మీడియా ల్యాబ్ ఆధ్వర్యంలో ‘ఎస్‌పీఏఆర్‌కే వాక్‌థాన్’ పేరుతో ప్రతి నెల వాక్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

అయితే 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాల కారణంగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎన్‌సీడీ స్క్రీనింగ్, శానిటేషన్ డ్రైవ్ వాయిదా పడింది.

సీనియర్ జర్నలిస్టులు మాధవ్ మధుసూదన్, అజిత్ రాచూరి మాట్లాడుతూ భారత్‌ను డయాబెటిస్ రాజధానిగా పిలవడం హెచ్చరికగా తీసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచుతాయని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News