Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:49 PM

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాక్‌థాన్. ప్రివెంటివ్ హెల్త్‌పై ప్రజల్లో అవగాహన

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాక్‌థాన్. ప్రివెంటివ్ హెల్త్‌పై ప్రజల్లో అవగాహన

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాక్‌థాన్.  ప్రివెంటివ్ హెల్త్‌పై ప్రజల్లో అవగాహన
11-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరగూడ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదరగూడ, ఉప్పర్పల్లి, అట్టాపూర్ ప్రాంతాల ప్రజలు కమ్యూనిటీ వాక్ నిర్వహించారు. “టుగెదర్ ఫర్ హెల్త్ – స్టాండ్ విత్ సైన్స్” అనే థీమ్‌తో పెద్ద తల్లకుంట పార్క్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానికులు నల్లింగ్ రమేష్, మొండ్రా కొమ్రయ్య, కే. హరినాథ్, సహదేవ రెడ్డి, బర్ల జంగయ్యతో పాటు గైనకాలజిస్టు డాక్టర్ రాణి కొప్పుల, ఇస్కాన్ అట్టాపూర్ ప్రతినిధి రాధాకాంత్ దాస్ పాల్గొన్నారు.

జీవనశైలి వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని వక్తలు పేర్కొన్నారు. ప్రజలే ముందుకు వచ్చి ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అహంసూత్ర మీడియా ల్యాబ్ ఆధ్వర్యంలో ‘ఎస్‌పీఏఆర్‌కే వాక్‌థాన్’ పేరుతో ప్రతి నెల వాక్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

అయితే 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాల కారణంగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎన్‌సీడీ స్క్రీనింగ్, శానిటేషన్ డ్రైవ్ వాయిదా పడింది.

సీనియర్ జర్నలిస్టులు మాధవ్ మధుసూదన్, అజిత్ రాచూరి మాట్లాడుతూ భారత్‌ను డయాబెటిస్ రాజధానిగా పిలవడం హెచ్చరికగా తీసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచుతాయని అన్నారు.

Sthanikam

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాక్‌థాన్. ప్రివెంటివ్ హెల్త్‌పై ప్రజల్లో అవగాహన

Article Image

హైదరగూడ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదరగూడ, ఉప్పర్పల్లి, అట్టాపూర్ ప్రాంతాల ప్రజలు కమ్యూనిటీ వాక్ నిర్వహించారు. “టుగెదర్ ఫర్ హెల్త్ – స్టాండ్ విత్ సైన్స్” అనే థీమ్‌తో పెద్ద తల్లకుంట పార్క్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానికులు నల్లింగ్ రమేష్, మొండ్రా కొమ్రయ్య, కే. హరినాథ్, సహదేవ రెడ్డి, బర్ల జంగయ్యతో పాటు గైనకాలజిస్టు డాక్టర్ రాణి కొప్పుల, ఇస్కాన్ అట్టాపూర్ ప్రతినిధి రాధాకాంత్ దాస్ పాల్గొన్నారు.

జీవనశైలి వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని వక్తలు పేర్కొన్నారు. ప్రజలే ముందుకు వచ్చి ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అహంసూత్ర మీడియా ల్యాబ్ ఆధ్వర్యంలో ‘ఎస్‌పీఏఆర్‌కే వాక్‌థాన్’ పేరుతో ప్రతి నెల వాక్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

అయితే 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాల కారణంగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎన్‌సీడీ స్క్రీనింగ్, శానిటేషన్ డ్రైవ్ వాయిదా పడింది.

సీనియర్ జర్నలిస్టులు మాధవ్ మధుసూదన్, అజిత్ రాచూరి మాట్లాడుతూ భారత్‌ను డయాబెటిస్ రాజధానిగా పిలవడం హెచ్చరికగా తీసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచుతాయని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News