Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:01 PM

ప్రజావాణి అర్జీలు సత్వర పరిష్కారం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రజావాణి అర్జీలు సత్వర పరిష్కారం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రజావాణి అర్జీలు సత్వర పరిష్కారం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
March 09, 2026 03:30 PM 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన మొత్తం 46 అర్జీలను స్వీకరించారు.

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పెండింగ్ లేకుండా పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తుపై బాధ్యతాయుతంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా వచ్చిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 24, గ్రామీణాభివృద్ధి శాఖకు 5, మున్సిపాలిటీకి 4, హౌసింగ్ శాఖకు 2, పోలీస్ శాఖకు 2, డివిజనల్ పంచాయతీకి 2 అర్జీలు వచ్చాయి. అలాగే సర్వే ల్యాండ్, జిల్లా సంక్షేమ, ఎస్‌డీసీ, ఇరిగేషన్, ఆర్టీసీ, విద్య, రోడ్లు-భవనాలు తదితర శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి సహా వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News