Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:49 AM

ప్రజావాణి అర్జీలు సత్వర పరిష్కారం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రజావాణి అర్జీలు సత్వర పరిష్కారం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రజావాణి అర్జీలు సత్వర పరిష్కారం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
March 09, 2026 03:30 PM 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన మొత్తం 46 అర్జీలను స్వీకరించారు.

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పెండింగ్ లేకుండా పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తుపై బాధ్యతాయుతంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా వచ్చిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 24, గ్రామీణాభివృద్ధి శాఖకు 5, మున్సిపాలిటీకి 4, హౌసింగ్ శాఖకు 2, పోలీస్ శాఖకు 2, డివిజనల్ పంచాయతీకి 2 అర్జీలు వచ్చాయి. అలాగే సర్వే ల్యాండ్, జిల్లా సంక్షేమ, ఎస్‌డీసీ, ఇరిగేషన్, ఆర్టీసీ, విద్య, రోడ్లు-భవనాలు తదితర శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి సహా వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News