ప్రజావాణి అర్జీలు సత్వర పరిష్కారం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రజావాణి అర్జీలు సత్వర పరిష్కారం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
Editor Desk
యాదాద్రి భువనగిరి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన మొత్తం 46 అర్జీలను స్వీకరించారు.
ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పెండింగ్ లేకుండా పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తుపై బాధ్యతాయుతంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా వచ్చిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 24, గ్రామీణాభివృద్ధి శాఖకు 5, మున్సిపాలిటీకి 4, హౌసింగ్ శాఖకు 2, పోలీస్ శాఖకు 2, డివిజనల్ పంచాయతీకి 2 అర్జీలు వచ్చాయి. అలాగే సర్వే ల్యాండ్, జిల్లా సంక్షేమ, ఎస్డీసీ, ఇరిగేషన్, ఆర్టీసీ, విద్య, రోడ్లు-భవనాలు తదితర శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి సహా వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి