ప్రజాప్రతినిధుల సన్మానం… నియోజకవర్గ సాధనకు పిలుపు
ప్రజాప్రతినిధుల సన్మానం… నియోజకవర్గ సాధనకు పిలుపు
Editor Desk
రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో తుమ్మలగూడెం, నిధాన్పల్లి గ్రామాల ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలగూడెం సర్పంచ్ విక్రమ్, ఉప సర్పంచ్ పోలిపాక జయసుధ, నిధాన్పల్లి సర్పంచ్ నారపాక మాధవి, ఉప సర్పంచ్ కొండ అండాలు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.
సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ రామన్నపేటను తిరిగి అసెంబ్లీ నియోజకవర్గంగా సాధించుకోవడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజాప్రతినిధులు, మాజీ నాయకులు, ప్రజలు అందరూ ఏకమై ఉద్యమిస్తేనే లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షను తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్, మాధవి స్పందిస్తూ నియోజకవర్గ సాధన కోసం సమితి చేపట్టే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్ల నరేందర్, గడ్డం యాదగిరి, డాక్టర్ నకిరేకంటి అశోక్, ఎండీ ఫజల్, జెట్టి శివప్రసాద్, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్, ఆవుల నరేందర్, ఎండీ ఇమామ్, మీర్ ఖాజా అలీ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి