Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 10:26 PM

ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం

ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం

ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం
April 24, 2026 09:05 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వలిగొండ పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తలు, విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి తుమ్మల వెంకటరెడ్డి,మాజీ జెడ్పిటిసి మొగుళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి రైతులకు నీరు అందించిన అపర భగీరథుడు కేసీఆర్ అని అన్నారు. వరి పంటలో పంజాబ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనుడు కేసిఆర్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని,కుంగిపోయిందని అబద్ధపు మాటలు చెప్పి జస్టిస్ గోష్ కమిషన్ వేసి కేసిఆర్ ను బద్నాం చేయాలని చూసినా నేడు కాలేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి అవకతవకలు జరగలేదని కోర్టు స్పష్టంగా తీర్పునిచ్చిందని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి,ఉత్తం కుమార్ రెడ్డి కలసి ఢిల్లీకి వెళ్లి సిబిఐ మీద ఒత్తిడి తెస్తామని అంటున్నారని సిబిఐ సంస్థకు చేయడం చేతకాదా అని జిల్లా నాయకులు కొమురెల్లి సంజీవరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పల్సం రమేష్,పట్టణ అధ్యక్షులు అప్రోజ్, యూత్ అధ్యక్షులు పల్సం రాజు,టేకులసోమవారం సర్పంచ్ పడమటి మమతారెడ్డి,కేర్చిపల్లి సర్పంచ్ మద్దెల మంజుల,వలిగొండ వార్డు మెంబర్ బల్గూరి నరేష్ రెడ్డి,ఐటిపాముల ప్రభాకర్,స్వామి,వెలువర్తి గ్రామ అధ్యక్షులు కలుకూరి రాములు, నాగిల్ల యాదగిరి,పోలేపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News