PRINT TIME: April 25, 2026 08:07 PM
ప్రజల దాహార్తిని తీర్చిన చంద్రశేఖర్ రెడ్డి
ప్రజల దాహార్తిని తీర్చిన చంద్రశేఖర్ రెడ్డి
April 25, 2026 06:19 PM
12 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఎల్బీనగర్
చైతన్యపురి డివిజన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడానికి తనవంతు కృషి చేస్తున్నట్లు బి ఆర్ ఎస్ నాయకుడు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. డివిజన్ లోని మున్సిపల్ కాలనీలో బోర్లు చెడిపోయి కాలనీలో నీటి సమస్య ఉందని కాలనీ అధ్యక్షులు శ్రీహరి, నాయకులు నరేష్ తన దృష్టికి తీసుకురాగా సొంత నిధులతో రెండు రోజులలో బోర్లు రిపేర్ చేయించి శనివారం కాలనీ వాసులకు మంచినీరు అందించానని తెలిపారు. ప్రతీ ఇంటికి నీరు అందేలా చర్యలు తీసుకోవడంతో మున్సిపల్ కాలనీ అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డిని సత్కరించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కాలనీ అధ్యక్షులు శ్రీహరి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, సీనియర్ నాయకులు పురుషోత్తం, పులి కిరణ్, నరేష్, సాయి, వినోద్ కుమార్, శివప్రసాద్, అభిషేక్, ప్రమోద్, అజ్జు, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి