ప్రైవేట్ స్కూళ్లకు అండగా డిప్యూటీ డీఈఓ?.. సస్పెన్షన్ డిమాండ్
ప్రైవేట్ స్కూళ్లకు అండగా డిప్యూటీ డీఈఓ?.. సస్పెన్షన్ డిమాండ్
Editor Desk
ఆదోని పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు అండగా నిలుస్తున్న డిప్యూటీ డీఈఓపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన, పట్టణ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడారు.
పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తమ పాఠశాలలో చేర్పించమంటూ ఒత్తిడి తెచ్చి, పుస్తకాలు, టై, బెల్టు పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతిరోజూ అనేక మంది కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న పరిస్థితి నెలకొందన్నారు.
డిప్యూటీ డీఈఓ తన నివాసాన్నే కార్యాలయంగా మార్చి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేయించుకోవాలంటే సాయంత్రం తర్వాత ఇంటికి రావాలని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే విచారణ చేపట్టి సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి