Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నకిరేకల్‌కు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి రైల్వే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన.. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:05 PM

ప్రైవేట్ స్కూల్‌ల ఫీజుల దోపిడీ: ఎస్ఎఫ్ఐ

ప్రైవేట్ స్కూల్‌ల ఫీజుల దోపిడీ: ఎస్ఎఫ్ఐ

ప్రైవేట్ స్కూల్‌ల ఫీజుల దోపిడీ: ఎస్ఎఫ్ఐ
March 29, 2026 05:35 PM 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి.మమత

రామన్నపేట: జిల్లాలో అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నందున, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మెడబోయిన మమత డిమాండ్ చేశారు.

ఆదివారం రామన్నపేట మండలంలోని ఎస్ఎఫ్ఐ మండల కార్యాలయంలో జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మమత, పాఠశాలలు అనుమతి లేకుండా పుట్టగొడుగుల ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయన్నారు. విద్యా సంవత్సరం ముగింపు దశలో విద్యార్థులపై బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఇది చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఇంకా అమలు చేయని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

ఇకనేరుగా, అనుమతులు లేని పాఠశాలలకు గుర్తింపు రద్దు చేయాలని, జిల్లాలో ఫీజుల దోపిడీ జరిపే ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న 9500 కోట్లు స్కాలర్‌షిప్ ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలని మమత డిమాండ్ చేశారు. అలాగే, హాస్టల్ విద్యార్థులకు ఆరు నెలల నుండి మేస్ చార్జీలు విడుదల చేయడం లేదు, తద్వారా విద్యార్థులు ఇబ్బందికి గురి అవుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పుట్టల ఉదయ్, ధరావత్ జగన్ నాయక్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News