Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థినిగా మారిన మహిళా ఎస్ ఐ .. ఆకతాయిలకు చెక్ తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు: డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం.. ఉప్పెనలా చెలరేగిన కోహ్లీ, పడిక్కల్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 07:47 PM

ప్రైవేట్ స్కూల్‌ల ఫీజుల దోపిడీ: ఎస్ఎఫ్ఐ

ప్రైవేట్ స్కూల్‌ల ఫీజుల దోపిడీ: ఎస్ఎఫ్ఐ

ప్రైవేట్ స్కూల్‌ల ఫీజుల దోపిడీ: ఎస్ఎఫ్ఐ
March 29, 2026 05:35 PM 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి.మమత

రామన్నపేట: జిల్లాలో అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నందున, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మెడబోయిన మమత డిమాండ్ చేశారు.

ఆదివారం రామన్నపేట మండలంలోని ఎస్ఎఫ్ఐ మండల కార్యాలయంలో జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మమత, పాఠశాలలు అనుమతి లేకుండా పుట్టగొడుగుల ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయన్నారు. విద్యా సంవత్సరం ముగింపు దశలో విద్యార్థులపై బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఇది చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఇంకా అమలు చేయని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

ఇకనేరుగా, అనుమతులు లేని పాఠశాలలకు గుర్తింపు రద్దు చేయాలని, జిల్లాలో ఫీజుల దోపిడీ జరిపే ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న 9500 కోట్లు స్కాలర్‌షిప్ ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలని మమత డిమాండ్ చేశారు. అలాగే, హాస్టల్ విద్యార్థులకు ఆరు నెలల నుండి మేస్ చార్జీలు విడుదల చేయడం లేదు, తద్వారా విద్యార్థులు ఇబ్బందికి గురి అవుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పుట్టల ఉదయ్, ధరావత్ జగన్ నాయక్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News